Begin typing your search above and press return to search.
మహేష్ తర్వాత దేవరకొండ స్పీడ్
By: Tupaki Desk | 9 Feb 2019 4:12 AM GMTవిజయ్ దేవరకొండ టాలీవుడ్ లో ఆల్ టైమ్ సెన్సేషన్. తను ఏం చేసినా సంచలనమే. `అర్జున్ రెడ్డి` సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ హీరోగా అవతరించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత అదే దూకుడుని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నాడు. `గీత గోవిందం` సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ తెలంగాణ హీరో ఇండస్ట్రీలో ఇప్పుడు హట్ ఫేవరేట్. వరుస చిత్రాల్లో నటిస్తూ క్రేజీ హీరోలకు ముచ్చమటలు పట్టిస్తున్న దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గానూ అదే హవాను కొనసాగిస్తున్నాడు.
ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ సంస్థ నిర్మిస్తున్న `డియర్ కామ్రేడ్` చిత్రంతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎస్. రామారావు నిర్మిస్తున్న సినిమాలోనూ నటిస్తున్నాడు. ఓ పక్క వరుస చిత్రాల్లో నటిస్తూనే క్రేజీ బ్రాండ్ లకు అంబాసిడర్ గా బిజీ అయిపోతున్నాడు. తాజాగా సంగీతా మొబైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం చేసిన విజయ్ దీని కోసం రూపొందించిన యాడ్ లో నటించాడు. ఇప్పుడు ఆ యాడ్ సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. విజయ్తో పాటు ఈ యాడ్ లో వెన్నెల కిషోర్ కూడా నటించాడు. అయితే తను మేకగా కనిపించడం ఆకట్టుకుంటోంది. రామానాయుడు స్టూడియోస్ లోని బస్ సెట్ లో ఈ యాడ్ ను షూట్ చేశారు. గొర్రె ఆకారంలో వున్న వెన్నెల కిషోర్ విజయ్ దేవరకొండను బావా..బవా అంటూ సంబోధించడం పలువురిని ఆకట్టుకుంటోంది. గొర్రెల మందల్లా జనాలు ఒకరు ఏది చేస్తే అది అనాలోచితంగా ఫాలో అవుతుంటారని సింబాలిక్ గా చూపిస్తూ చేసిన ఈ యాడ్ సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతోంది.
టాలీవుడ్ లో బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ పేరు మార్మోగిపోతోంది. ఆ తర్వాత చరణ్ - బన్ని - అఖిల్ వంటి హీరోలు బ్రాండ్ పబ్లిసిటీలో స్పీడ్ చూపిస్తుంటారు. ఈ హీరోల తర్వాత నైజాం మెగాస్టార్ గా పాపులరవుతున్న విజయ్ దేవరకొండకు మాత్రమే అంత క్రేజు ఉంది. ఇటీవల దేవరకొండ దూకుడు ముందు ఇతరులు కనిపించడం లేదు కాబట్టి మహేష్ తర్వాతి స్థానం అతడికే దక్కుతుందన్న విశ్లేషణ సాగుతోంది. వాణిజ్య ప్రకటనల విషయంలో దేవరకొండ ఒక్కో కమిట్ మెంట్ కి ఏడాదికి రూ.2-3 కోట్లకు పైగానే డిమాండ్ చేస్తున్నాడట. సాధా సీదా ప్రకటనలకు అసలు ఛాన్సే లేదు. ఇక దేవరకొండను ప్రకటనల విషయమై సంప్రదించాలంటే అతడి చుట్టూ మేట వేసిన `కంచె`ను దాటుకుని వెళ్లాలంటే చాలానే కష్టం అని అనుభవం అయిన వాళ్లు చెబుతున్నారు.
ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ సంస్థ నిర్మిస్తున్న `డియర్ కామ్రేడ్` చిత్రంతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎస్. రామారావు నిర్మిస్తున్న సినిమాలోనూ నటిస్తున్నాడు. ఓ పక్క వరుస చిత్రాల్లో నటిస్తూనే క్రేజీ బ్రాండ్ లకు అంబాసిడర్ గా బిజీ అయిపోతున్నాడు. తాజాగా సంగీతా మొబైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం చేసిన విజయ్ దీని కోసం రూపొందించిన యాడ్ లో నటించాడు. ఇప్పుడు ఆ యాడ్ సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. విజయ్తో పాటు ఈ యాడ్ లో వెన్నెల కిషోర్ కూడా నటించాడు. అయితే తను మేకగా కనిపించడం ఆకట్టుకుంటోంది. రామానాయుడు స్టూడియోస్ లోని బస్ సెట్ లో ఈ యాడ్ ను షూట్ చేశారు. గొర్రె ఆకారంలో వున్న వెన్నెల కిషోర్ విజయ్ దేవరకొండను బావా..బవా అంటూ సంబోధించడం పలువురిని ఆకట్టుకుంటోంది. గొర్రెల మందల్లా జనాలు ఒకరు ఏది చేస్తే అది అనాలోచితంగా ఫాలో అవుతుంటారని సింబాలిక్ గా చూపిస్తూ చేసిన ఈ యాడ్ సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతోంది.
టాలీవుడ్ లో బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ పేరు మార్మోగిపోతోంది. ఆ తర్వాత చరణ్ - బన్ని - అఖిల్ వంటి హీరోలు బ్రాండ్ పబ్లిసిటీలో స్పీడ్ చూపిస్తుంటారు. ఈ హీరోల తర్వాత నైజాం మెగాస్టార్ గా పాపులరవుతున్న విజయ్ దేవరకొండకు మాత్రమే అంత క్రేజు ఉంది. ఇటీవల దేవరకొండ దూకుడు ముందు ఇతరులు కనిపించడం లేదు కాబట్టి మహేష్ తర్వాతి స్థానం అతడికే దక్కుతుందన్న విశ్లేషణ సాగుతోంది. వాణిజ్య ప్రకటనల విషయంలో దేవరకొండ ఒక్కో కమిట్ మెంట్ కి ఏడాదికి రూ.2-3 కోట్లకు పైగానే డిమాండ్ చేస్తున్నాడట. సాధా సీదా ప్రకటనలకు అసలు ఛాన్సే లేదు. ఇక దేవరకొండను ప్రకటనల విషయమై సంప్రదించాలంటే అతడి చుట్టూ మేట వేసిన `కంచె`ను దాటుకుని వెళ్లాలంటే చాలానే కష్టం అని అనుభవం అయిన వాళ్లు చెబుతున్నారు.