Begin typing your search above and press return to search.

పేరెంట్స్ కు ఎదురీదే కథ అంటున్న డైరెక్టర్

By:  Tupaki Desk   |   21 March 2018 4:50 PM GMT
పేరెంట్స్ కు ఎదురీదే కథ అంటున్న డైరెక్టర్
X
నీదీ నాదీ ఒకే కథ అంటూ శ్రీవిష్ణు హీరోగా చిత్రాన్ని రూపొందించాడు కొత్త దర్శకుడు వేణు ఊడుగుల. టీజర్ నుంచి విపరీతంగా అట్రాక్ట్ చేసిన ఈ మూవీ.. ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. 10 ఏళ్ల క్రితం సినిమా ప్రయాణం ప్రారంభించిన వేణు.. ఇప్పటికి తన కలను సాకారం చేసుకున్నానని.. విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని చెబుతున్నాడు.

ఇవాల్టి రోజుల్లో ప్రతీ తల్లిదండ్రులు తమ బిడ్డలను డాక్టర్ లేదా ఇంజినీర్ చేయాలని భావిస్తున్నారని.. వారి వ్యక్తిగత అభిప్రాయాలను విలువను ఇవ్వడం లేదని చెబుతున్నాడు వేణు ఊడుగుల. ఒక కాలేజ్ డ్రాపవుట్ ఎన్ని సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుందో చెప్పడం కూడా కష్టమైపోతోందని అంటున్నాడు. తన తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా జీవితానికి ఎదురీదిన ఓ వ్యక్తి కథే తన సినిమా అంటున్న ఈ దర్శకుడు.. ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ కూడా ఉంటుందని అనేక మంది తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించే పాయింట్ కూడా ఉంటుందని అంటున్నాడు.

హీరో శ్రీవిష్ణు తన కథను నమ్మి వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించినట్లు చెప్పిన వేణు ఊడుగుల.. భవిష్యత్తులో పెద్ద స్టార్ అయే లక్షణాలు ఈ కుర్రహీరోకు ఉన్నాని అంటున్నాడు. నీదీ నాదీ ఒకే కథ చిత్రానికి హీరో క్యారెక్టరైజేషన్ హైలైట్ అవుతుందని అన్నాడు ఈ కొత్త దర్శకుడు. ఇక తన గురించి చెబుతూ.. బస్ కండక్టర్ కావాలని తొలుత భావించేవాడినని.. వయసుతో పాటు మారిన ఆలోచనలు తనను ఓ దర్శకుడిగా మార్చాయని చెప్పాడు.