Begin typing your search above and press return to search.

ఇండియాస్‌ మోస్ట్‌ క్రేజీ మూవీలో మనోడు..!

By:  Tupaki Desk   |   19 Nov 2018 5:08 AM GMT
ఇండియాస్‌ మోస్ట్‌ క్రేజీ మూవీలో మనోడు..!
X
సౌత్‌ సినీ పరిశ్రమలోనే కాకుండా ఇండియాలోనే టాప్‌ దర్శకుల జాబితాలో శంకర్‌ ముందు వరుసలో ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. శంకర్‌ దర్శకత్వంలో నటించేందుకు బాలీవుడ్‌ స్టార్స్‌ కూడా క్యూ కడతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన ప్రతిభతో వెండి తెరపై అద్బుతాలను ఆవిష్కరించుకుంటూ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ డైరెక్టర్‌ గా పేరు తెచ్చుకున్న శంకర్‌ ప్రస్తుతం ‘2.ఓ’ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. ‘2.ఓ’ విడుదలవ్వడమే ఆలస్యం వెంటనే ‘ఇండియన్‌ 2’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాడు.

కమల్‌ హాసన్‌ తో దాదాపు రెండు దశాబ్దాల క్రితం శంకర్‌ తెరకెక్కించిన చిత్రం ‘భారతీయుడు’. అప్పట్లో తమిళం, తెలుగు, హిందీ ఇలా అన్ని భాషల్లో కూడా ఆ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ ను మళ్లీ కమల్‌ తోనే శంకర్‌ తెరకెక్కిస్తున్నాడు. అయితే శంకర్‌ పరిధి ఇప్పుడు బాగా పెరిగింది. ఆయన ఏ సినిమా చేసినా కూడా ఇండియా మొత్తం ఆయన సినిమా వైపు చూస్తుంది. అందుకే ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ ను ముఖ్య పాత్రలో నటింపజేయాలని శంకర్‌ భావిస్తున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ‘ఇండియన్‌ 2’ చిత్రంలో అజయ్‌ దేవగన్‌ విలన్‌ గా నటించబోతున్నాడు. ఇక తెలుగు నుండి ఈ చిత్రంలో నటించే బంపర్‌ ఆఫర్‌ టాప్‌ కమేడియన్‌ కు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది.

టాలీవుడ్‌ లో ప్రస్తుతం టాప్‌ కమెడియన్‌ గా, టాప్‌ పెయిడ్‌ ఆర్టిస్టుగా దూసుకు పోతున్న వెన్నెల కిషోర్‌ కు ‘ఇండియన్‌ 2’ లో ఛాన్స్‌ వచ్చిందట. ఇంకా ఆ విషయమై క్లారిటీ అయితే రాలేదు కాని పక్కా సమాచారం అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. మలయాళం నుండి ద్కుర్‌ సల్మాన్‌ ను, తమిళం నుండి కమల్‌, శింబును ఎంపిక చేసిన శంకర్‌ తెలుగు నుండి వెన్నె కిషోర్‌ ను ఎంపిక చేసుకున్నాడేమో. ఒకవేళ ఇదే నిజమయితే వెన్నెల కిషోర్‌ క్రేజ్‌ మరింత పెరగడం ఖాయం. ప్రస్తుతం తెలుగులో మోస్ట్‌ వాంటెడ్‌ కమెడియన్‌ గా వెన్నెల కిషోర్‌ దూసుకు పోతున్న విషయం తెల్సిందే. 2.ఓ హడావుడి పూర్తి అయిన తర్వాత శంకర్‌ పూర్తి వివరాలు వెళ్లడి చేసే అవకాశం ఉంది.