Begin typing your search above and press return to search.

కాలు విరిగినా.. కబుర్లెన్ని చెప్పాడో

By:  Tupaki Desk   |   21 Oct 2016 5:02 PM GMT
కాలు విరిగినా.. కబుర్లెన్ని చెప్పాడో
X
చేసింది తక్కువ సినిమాలే అయినా..యూత్ లో మాంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు వరుణ్ తేజ్. తాను చేసే సినిమా ఒక దానితో మరొకటి సంబంధం లేకుండా జాగ్రత్తలు తీసుకోవటమే కాదు.. సినిమా సినిమాకు తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ అభిమానుల మనసుల్ని దోచుకుంటున్నాడీ యువహీరో. ప్రస్తుతం ఫిదా.. మిస్టర్ సినిమాలు చేస్తున్న వరుణ్ తేజ్.. ఈ మధ్యన షూటింగ్ లో గాయపడి.. కాలు ఫ్యాక్చర్ తో ఇంట్లో బందీ అయిపోయాడు. తిరిగే కాలు.. తిట్టే నోరు ఊరికే ఉండదన్న చందంగా ఇతగాడు..తాజాగా ట్విట్టర్లో లైవ్ ఛాట్ కాసేపు అభిమానులతో గడిపాడు.

తమ కలల స్టార్ తమతో మాట్లాడతానంటే అభిమానులకు అంతకు మించికావాల్సిందేముంది? అంతే.. కొంటెగా కొందరు.. సీరియస్ గా మరికొందరు.. ఆరాగా ఇంకొందరు తమ ప్రశ్నల్ని సంధించారు. ఎవరికి తగ్గట్లే వారికి బదులిచ్చిన వరుణ్.. తన మాటలతో అందరి మనసుల్ని దోచుకున్నాడు. రూ.500 ఛేంజ్ ఉందా? అంటే.. వచ్చి తీసుకో అని చెప్పేసిన వరుణ్.. ధ్రవ బెనిఫిట్ షో చూద్దాం బ్రదర్.. రెఢీగా ఉండు అంటే. ‘‘ఓకే.. నిజంగానే వెయిటింగ్’’ అని బదులిచ్చాడు.

మీ సినిమాల కోసం వెయిటింగ్ అంటే.. తాను కూడా త్వరగా సెట్ లోకి వెళదామనుకుంటున్నట్లు చెప్పాడు. తర్వాతి సినిమా రిలీజ్ డేట్ అంటే.. గాయం కారణంగా షూటింగ్ లేట్ కానుందని..దీంతో వచ్చే సంవత్సరమే తన సినిమా విడుదలయ్యేదని తేల్చేశాడు. సాయి పల్లవి గురించి అడిగితే అద్భుతమైన నటి అని చెప్పిన వరుణ్.. లావణ్య త్రిపాఠితో పని చేయటం చాలా సరదాగా ఉంటుందని చెప్పాడు. ఇంట్లో ఖాళీగా ఉన్నారుగా ఏం చేస్తున్నారంటే.. సినిమాలు.. పుస్తకాలని చెప్పి.. ఫ్యామిలీతో స్వీట్ మూమెంట్ సంక్రాంతికి అందరిని కలవటమన్నాడు. పెళ్లికి.. ఎప్పుడైనా సిద్ధమేనని తేల్చిన వరుణ్.. తన ఇష్టాయిష్టాల గురించి.. అభిమాన నటుల గురించి చెప్పాడు. మొత్తానికి ప్రశ్నలకు బదులిస్తూ టైం పాస్ చేస్తూనే.. ఫ్యాన్స్ ను ‘ఫిదా’ చేసేశాడు.