Begin typing your search above and press return to search.

గెడ్డంలో వంశీని గుర్తపట్టలేకపోయారు

By:  Tupaki Desk   |   16 Aug 2017 11:24 AM GMT
గెడ్డంలో వంశీని గుర్తపట్టలేకపోయారు
X
ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా కూడా 'నా పేరు సూర్య' సినిమా స్టిల్స్ కనిపిస్తున్నాయ్. కాని ఆ స్టిల్స్ చూసినవారందరూ.. అదేంటి ఈ సినిమాను వక్కంతం వంశీ డైరక్ట్ చేస్తున్నాడని చెప్పారుగా.. మరి మనోడు ఎక్కడా కనిపించడేంటి? అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఈ స్టిల్స్ ను జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక్క విషయం అర్ధమవుతుంది. పదండి అదేంటో చూద్దాం.

రైటర్ గా వక్కంతం ఎక్కడ కనిపించినా కూడా.. క్లీన్ షేవ్ తో కనిపించేవాడు. అయితే ఇప్పుడు సడన్ గా రూటు మార్చాడు. అందుకు ఒక కారణం ఉందట. నిజానికి తాను రైటర్ గా ఉన్నంత కాలం అసలు పీస్ ఆఫ్‌ మైండ్ అనేదే లేదంట. అప్పుడు ఎవరో స్వామీజిని కలిస్తే.. నిన్ను నువ్వు మార్చుకో.. గెడ్డం పెంచుకో.. కొత్త జీవితం చూస్తావు అన్నాడట. అలా గెడ్డం పెంచడం మొదలెట్టగానే ఎన్టీఆర్ సినిమా క్యాన్సిల్ అయితే.. వెంటనే బన్నీ పిలిచి సినిమా ఆఫర్ ఇచ్చేశాడట. అందుకని ఇప్పుడు అలాగే గెడ్డంతో కంటిన్యూ అవుతున్నాడు వక్కంతం వంశీ. అందుకే సాధారణ ప్రజలు గుర్తుపట్టలేకపోయారు.

ఇకపోతే 'నా పేరు సూర్య' కొత్త షెడ్యూల్ లో అల్లు అర్జున్ కూడా రంగప్రవేశం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ నుండి పైగా మన మెగా హీరో ఒక కొత్త ట్రైనర్ సహాయంతో కొత్తరకంగా బాడీ కూడా తయారుచేసుకుంటున్నాడు. ఇంతకీ ఆర్మీ మ్యాన్ గా అల్లు అర్జున్ ను వక్కంతం వంశీ ఎలా తీర్చిదిద్దుతున్నాడో తెలియాలంటే.. కాస్త ఆగాల్సిందే.