Begin typing your search above and press return to search.

డైరెక్టర్ శంకర్ కే చుక్కలు చూపిస్తున్నాడట

By:  Tupaki Desk   |   19 Nov 2017 4:25 AM GMT
డైరెక్టర్ శంకర్ కే చుక్కలు చూపిస్తున్నాడట
X
కేవలం సౌత్ ఇండియాలో మాత్రమే కాదు.. ఇండియాలోనే అతి పెద్ద దర్శకుల్లో శంకర్ ఒకడు. అలాంటి దర్శకుడికి తమిళ సీనియర్ కమెడియన్ వడివేలు చుక్కలు చూపిస్తున్నట్లు వెల్లడైంది. శంకర్ దర్శకుడే కాక నిర్మాత కూడా. ఆయన తన ప్రొడక్షన్లో తక్కువ బడ్జెట్లో మంచి అభిరుచి ఉన్న సినిమాలు నిర్మించాడు. అందులో ‘ఇంసై అరసన్ 24యమ్ పులకేసి’ కూడా ఒకటి. వడివేలును హీరోగా పెట్టి శంకర్ శిష్యుడు చింబుదేవన్ ఈ సినిమా తీశాడు. దశాబ్దం కిందట వచ్చిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తలపెట్టాడు శంకర్. వడివేలునే హీరోగా.. చింబుదేవన్ నే దర్శకుడిగా పెట్టుకున్నాడు.

ఐతే షూటింగుకి సరైన సమయానికి రాడని.. డబ్బులు ఎక్కువగా లాగుతాడని.. యూనిట్ సభ్యుల్ని ఇబ్బంది పెడతాడని వడివేలుపై ముందు నుంచి చాలా కంప్లైంట్లు ఉన్నాయి. మధ్యలో ఆయనకు అవకాశాలే లేకపోవడానికి ఇవి కూడా కారణాలే అంటారు. ఐతే ఈ మధ్య వడివేలు మళ్లీ కొన్ని అవకాశాలు దక్కించుకుని బిజీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే శంకర్ సినిమాలో హీరోగా నటించే ఛాన్సొచ్చింది. ఐతే వడివేలు ఈ చిత్ర షూటింగుకి అస్సలు సహకరించట్లేదట. రెమ్యూనరేషన్ విషయంలో పేచీలు పెట్టడమే కాక.. ఈ చిత్ర కాస్ట్యూమ్ డిజైనర్ తో.. నటీనటులతో కూడా గొడవ పెట్టుకున్నాడట. ఇంకా రకరకాల సమస్యలు సృష్టిస్తున్నాడట. ఇప్పటిదాకా 30 శాతం మాత్రమే షూటింగవ్వగా.. వడివేలు 70 శాతం పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. వడివేలు పెట్టే ఇబ్బందుల వల్ల తాను చాలా నష్టపోతున్నానని శంకర్ నడిగర్ సంఘంకు ఫిర్యాదు చేసే వరకు పరిస్థితి వెళ్లింది. ఇప్పుడు ఆ సంఘాన్ని నడిపించే నాజర్-విశాల్.. వడివేలుపై నిర్ణయంపై తీసుకోవాల్సి ఉంది.