Begin typing your search above and press return to search.

దిల్ రాజుకు పోటీగా వారొస్తున్నారు

By:  Tupaki Desk   |   11 Dec 2017 3:30 PM GMT
దిల్ రాజుకు పోటీగా వారొస్తున్నారు
X
టాలీవుడ్ లో ప్రస్తుతం కొందరు మాత్రమే కొన్ని ఏరియాల్లో బడా సినిమాలను కొనుగోలు చేసి బిజినెస్ చేస్తున్నారు. ముఖ్యంగా నైజాం ఏరియా తెలుగు ఇండస్ట్రీకి ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద సినిమాలు అక్కడ ఉహలకందని కలెక్షన్స్ ని వసూలు చేస్తాయి దీంతో కొన్ని పెద్ద సంస్థలు దాదాపు స్టార్ హీరోలందరి సినిమాలను ఒక రేట్ కి కొనుక్కొని అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ చేసుకుంటారు.

గత కొన్నేళ్లుగా అక్కడ దిల్ రాజు - ఏషియన్ ఫిలిమ్స్ వారే డిస్ట్రిబ్యూటర్స్ గా ఉంటున్నరు. మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ హీరోలతో పాటు పెద్ద దర్శకుల సినిమాలను సైతం వారే రిలీజ్ చేస్తుంటారు. కానీ వారికీ పోటీగా ఇప్పుడు కొత్తగా యూవీ క్రియేషన్స్ కూడా తన స్టామినాను చాటుకోవాలని చూస్తోంది. తెలుగులో వరుస హిట్స్ అందుకుంటున్న యూవీ సంస్థ ఇప్పుడు నైజాం డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోకి అడుగుపెట్టేసింది.

ప్రస్తుతం రంగస్థలం సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ వారు సేఫ్ బడ్జెట్ లో సినిమాను తీశారు. అయితే సినిమా బిజినెస్ మాత్రం వారు ఊహించని విధంగా జరుగుతోంది. కేవలం నైజాం ఏరియాలోనే రూ.18 కోట్లకు రంగస్థలం అమ్ముడుపోయింది. యూవీ క్రియేషన్స్ లో ఉండే విక్కీ ఆ సినిమాను పంపిణి చేస్తున్నాడు. రామ్ చరణ్ కు అతనికి మంచి స్నేహం ఉండడంతో ఆ డీల్ సెట్ అయ్యిందని తెలుస్తోంది. మరి దిల్ రాజు రేంజ్ లో యూవీ బిజినెస్ చేయగలుగుతుందా లేదా చూడాలి.