Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: వీళ్లంతా సోషల్ క్వీన్స్
By: Tupaki Desk | 10 Feb 2019 12:36 PM GMTసోషల్ మీడియా వల్ల లాభమా? నష్టమా? అంటే అది పబ్లిసిటీకి ఓ ఆయాచిత వరం అనే చెప్పాలి. సోషల్ మీడియా పుణ్యమా అని అసలు అంతగా పరిచయం లేని ముఖాలు కూడా అంతర్జాలంలో విపరీతంగా ప్రమోట్ అయిపోతున్నాయి. ఓవైపు అగ్ర కథానాయికలు సోషల్ మీడియాలో తామర తంపరగా లేటెస్ట్ ఫోటోషూట్లతో హడావుడి చేస్తుంటే, అంతకుమించి టాప్ మోడల్స్, ముంబై ముద్దుగుమ్మలు తమ ప్రొఫైల్ ఫోటోలతో వేడెక్కిస్తున్నారు.
సోషల్ మీడియా వల్లనే మర్చిపోయిన భామలంతా తిరిగి అభిమానులకు గుర్తుకొస్తున్నారంటే ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం నేటి తరం కథానాయికలు, టీవీ నటీమణులే కాదు, నాటి తరం నాయికలు, నటిమణులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లోకి వెళుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారానే భారతీయుడు చిత్రంలో నటించిన కస్తూరి, సీనియర్ నటి మీనా, ఖుష్బూ వంటి వాళ్లు తిరిగి మరోసారి అనూహ్య ంగా వెలుగులో కి వచ్చారు. అలా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వేడి పెంచుతున్న భామల జాబితా వెతికితే.. ఇదిగో ఈ బ్యూటీస్ అంతా నిరంతరం యువతరాన్ని వేడెక్కిస్తున్నారని లెక్క తేలింది.
ఇందులో తెలుగు వారికి తెలిసిన భామలు ఉన్నారు. సోషల్ మీడియాలో స్పీడ్ మీద ఉండే బ్యూటీగా అదా శర్మ, దిశా పటానీ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ఒరు ఆధార్ లవ్ ఫేం ప్రియా వారియర్ కి అంతే క్రేజు నెలకొంది. సన్నీలియోన్ అంతే స్పీడ్ చూపిస్తూ ఉంటుంది. ఎమీజాక్సన్ నోరా ఫతేహి, నేహాశర్మ వంటి అందగత్తెలు జరంత స్పీడ్ గానే ఉంటారు. వీళ్లతో పాటే డీజే బ్యూటీ పూజా హెగ్డే, 1 నేనొక్కడినే ఫేం కృతి సనోన్, బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్ వీళ్లంతా సోషల్ మీడియాలో జరంత స్పీడ్ గానే ఉన్నారు. ఈ భామలతో పాటు హార్థిక పాండ్య గాళ్ ఫ్రెండ్ ఎల్లీ అవ్ రామ్, ఆహా కళ్యాణం హీరోయిన్ వాణీకపూర్, నిహారిక అగర్వాల్, పాయల్ వద్వా తదితర భామలు నిరంతరం లేటెస్ట్ ఫోటోషూట్లతో వేడి పెంచుతున్నారని తెలుస్తోంది. ఆల్మోస్ట్ గ్లామర్ ప్రపంచంలో అవకాశాల కోసం వేటాడే భామలంతా సోషల్ మీడియాపైనే డిపెండ్ అవుతున్నారు. అక్కడ తమ ఫోటోలు, ప్రొఫైల్స్ చూసి అవకాశాలిచ్చేవాళ్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయిట. ఇది ఓ రకంగా ఊహించని ట్రెండ్. అందరికీ ఆమోద యోగ్యమైన ట్రెండ్. అయితే ఈ సోషల్ మీడియా వల్ల భవిష్యత్ లో పొంచి ఉన్న పెనుముప్పు గురించి మరో కోణంలో ఊహాతీతమైన చర్చ సాగుతోంది.
సోషల్ మీడియా వల్లనే మర్చిపోయిన భామలంతా తిరిగి అభిమానులకు గుర్తుకొస్తున్నారంటే ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం నేటి తరం కథానాయికలు, టీవీ నటీమణులే కాదు, నాటి తరం నాయికలు, నటిమణులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లోకి వెళుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారానే భారతీయుడు చిత్రంలో నటించిన కస్తూరి, సీనియర్ నటి మీనా, ఖుష్బూ వంటి వాళ్లు తిరిగి మరోసారి అనూహ్య ంగా వెలుగులో కి వచ్చారు. అలా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వేడి పెంచుతున్న భామల జాబితా వెతికితే.. ఇదిగో ఈ బ్యూటీస్ అంతా నిరంతరం యువతరాన్ని వేడెక్కిస్తున్నారని లెక్క తేలింది.
ఇందులో తెలుగు వారికి తెలిసిన భామలు ఉన్నారు. సోషల్ మీడియాలో స్పీడ్ మీద ఉండే బ్యూటీగా అదా శర్మ, దిశా పటానీ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ఒరు ఆధార్ లవ్ ఫేం ప్రియా వారియర్ కి అంతే క్రేజు నెలకొంది. సన్నీలియోన్ అంతే స్పీడ్ చూపిస్తూ ఉంటుంది. ఎమీజాక్సన్ నోరా ఫతేహి, నేహాశర్మ వంటి అందగత్తెలు జరంత స్పీడ్ గానే ఉంటారు. వీళ్లతో పాటే డీజే బ్యూటీ పూజా హెగ్డే, 1 నేనొక్కడినే ఫేం కృతి సనోన్, బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్ వీళ్లంతా సోషల్ మీడియాలో జరంత స్పీడ్ గానే ఉన్నారు. ఈ భామలతో పాటు హార్థిక పాండ్య గాళ్ ఫ్రెండ్ ఎల్లీ అవ్ రామ్, ఆహా కళ్యాణం హీరోయిన్ వాణీకపూర్, నిహారిక అగర్వాల్, పాయల్ వద్వా తదితర భామలు నిరంతరం లేటెస్ట్ ఫోటోషూట్లతో వేడి పెంచుతున్నారని తెలుస్తోంది. ఆల్మోస్ట్ గ్లామర్ ప్రపంచంలో అవకాశాల కోసం వేటాడే భామలంతా సోషల్ మీడియాపైనే డిపెండ్ అవుతున్నారు. అక్కడ తమ ఫోటోలు, ప్రొఫైల్స్ చూసి అవకాశాలిచ్చేవాళ్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయిట. ఇది ఓ రకంగా ఊహించని ట్రెండ్. అందరికీ ఆమోద యోగ్యమైన ట్రెండ్. అయితే ఈ సోషల్ మీడియా వల్ల భవిష్యత్ లో పొంచి ఉన్న పెనుముప్పు గురించి మరో కోణంలో ఊహాతీతమైన చర్చ సాగుతోంది.