Begin typing your search above and press return to search.

గోవాలో డ్రగ్స్ బ్యాచ్ తో ఫోటోలు దిగాడా?

By:  Tupaki Desk   |   22 July 2017 6:00 PM GMT
గోవాలో డ్రగ్స్ బ్యాచ్ తో ఫోటోలు దిగాడా?
X
ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) తన పని వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారనే అనుమానం ఉన్నవారందరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిని ఒక్కొక్కరుగా విచారణకు పిలిపించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మొదలుకొని ఇప్పటివరకు నటుడు సుబ్బరాజు సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడులను ఇప్పటివరకు విచారించారు. తాజాగా హీరో తరుణ్ ను ఎక్సైజ్ కార్యాలయానికి పిలిపించి పలు అంశాలపై ప్రశ్నలు అడిగారు. విచారణకు హాజరయ్యే ముందు దేవుడి గుడికెళ్లి దణ్ణం పెట్టుకుని మరీ తరుణ్ వెళ్లాడు. సెలబ్రిటీలను విచారణకు పిలిచే ముందు పోలీసులు ముందస్తు గ్రౌండ్ వర్క్ గట్టిగా చేయడంతో సమాధానాలు చెప్పేవారు ఇరుకున పడిపోతున్నారు. తరుణ్ నెలలో అత్యధిక రోజులు గోవాలో గడుపుతుంటాడట. అక్కడ బీచ్ లో దిగిన పలు ఫొటోల్లో డ్రగ్స్ కేసులో నిందితులు కూడా ఉన్నారట. దీంతో ఆ ఫొటోలన్నీ అతడి ముందుపెట్టి వారితో ఉన్న సంబంధాలపై ప్రశ్నలు ఎక్కుపెట్టారని తెలుస్తోంది.

గోవా టూరిస్ట్ ప్లేస్ కావడంతో పాటు అక్కడ డ్రగ్స్ వాడకమూ ఎక్కువే. బీచ్ హౌస్ ల్లో జరిగే పార్టీలు వాటిలో డ్రగ్స్ వాడకంపైనా కొశ్చన్స్ అడిగారనేది టాక్. ఏదేమైనా డ్రగ్స్ కేసు విషయంలో ఈసారి పోలీసులు గట్టి పట్టుదలతో ఉండటం... పకడ్బందీగా ముందుకెళ్తుండటంతో టాలీవుడ్ అంతా గుంభనంగా ఉంటోంది.