Begin typing your search above and press return to search.

నాకు డైరెక్టర్ తో గొడవలు లేవ్

By:  Tupaki Desk   |   16 Jan 2018 3:24 PM GMT
నాకు డైరెక్టర్ తో గొడవలు లేవ్
X
2014 లో రిలీజ్ అయిన కంగనా రనౌత్ నటించిన "క్వీన్"సినిమా చాలా ఐకానిక్. ఇప్పుడు ఆ సినిమాను సౌత్ ఇండస్ట్రీ లో నాలుగు వేర్వేరు భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి కూడా తెల్సిందే. తెలుగు లో మిల్కీ బ్యూటీ తమన్నా తోను మలయాళం లో మంజిమామోహన్ తో ఈ సినిమాను డైరెక్టర్ నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నాడు. కానీ ఈ మధ్య తమన్నా అండ్ నీలకంఠ కి వచ్చిన గొడవల కారణంగా డైరెక్టర్ నీలకంఠ తెలుగు సినిమా నుండి తప్పుకోవడం జరిగింది అన్న రూమర్ తెలుగు ప్రేక్షకులను షాక్ కు గురిచేసింది.

దీని మీద ఈ మధ్యనే తమన్నా నోరువిప్పింది. "నేను ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఏ యాక్టర్ కి కూడా సినిమా సాంకేతిక విభాగం పై ఎటువంటి అధికారం ఉండదు. నేను కానీ నా టీం కానీ ఎప్పుడు కూడా క్వీన్ సినిమా విషయంలో ఆ అధికారాన్ని పొందాలని ప్రయత్నించలేదు. నిర్మాతకు మాత్రమే ఆ హక్కు ఉంటుంది. నాకు నీలకంఠ గారంటే ఎంతో గౌరవం. ప్రొడ్యూసర్ (మను కుమారన్) మాత్రమే గత సంవత్సరం నవంబర్ లో ఈ ప్రాజెక్టులో కొన్ని మార్పులు చెప్పడం జరిగింది" అని చెప్పుకొచ్చింది తమన్నా.

ఫ్యాన్స్ అంత సినిమా ఆఖరి షెడ్యూల్ మళ్ళీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో అని ఎదురుచూస్తున్నారు. ఈ నాలుగు భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం వాళ్లందరికీ ఒక డ్రీం ప్రాజెక్ట్ లాంటిది అంటూ వాళ్ళందరూ కలిసి ప్రేక్షకుల కోసం ఒక అందమైన సినిమాను చేయాలి అనుకున్నారని కూడా చెప్పింది తమన్నా. ఇంతకీ నీలకంఠ మళ్ళీ వచ్చి దర్శకత్వం కొనసాగిస్తారా లేదా మరెవరైనా ఆయన స్థానం లో దర్శకత్వం
చేస్తున్నారా అన్న విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.