Begin typing your search above and press return to search.

మిల్కీబ్యూటీకి రెండు కోట్లు ఇచ్చారా?

By:  Tupaki Desk   |   18 May 2018 10:16 AM GMT
మిల్కీబ్యూటీకి రెండు కోట్లు ఇచ్చారా?
X
స‌న్సెష‌న‌ల్ హిట్ ‘బ‌హుబ‌లి’ మొద‌టిభాగంలో ప్ర‌భాస్ తో ప‌చ్చ‌బోట్టు వేయించుకున్న‌ మిల్కీ బ్యూటీ... రెండో భాగంలో స‌రైన పాత్ర క‌నిపించ‌క‌పోవ‌డంతో బాగా హ‌ర్ట‌య్యింది. ఆ సినిమా త‌ర్వాత చెప్పుకోవ‌డానికి సినిమాలు చేస్తున్నా... క్రేజీ ప్రాజెక్టులైతే చేజిక్కుకోలేక‌పోయింది త‌మ‌న్నా. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ రామ్ తో ‘నా నువ్వే’ అంటూ ఓ డిఫ‌రెంట్ రొమాంటిక్ మూవీ చేస్తున్న త‌మ్యూ డార్లింగ్ కి పారితోషికం మాత్రం బాగా ముట్టింద‌ట‌.

స్టార్ హీరోయిన్ స్టేట‌స్ సంపాదించుకున్న చాలామంది తెలుగు హీరోయిన్లు సినిమాకి కోటి రూపాయ‌ల దాకా డిమాండ్ చేస్తున్నారు. అయితే త‌మ‌న్నా ‘నా నువ్వే’ సినిమా కోసం ఏకంగా కోటి ఎన‌భై ల‌క్ష‌ల రూపాయ‌ల పారితోషికం అందుకుంద‌ట‌. అంటే దాదాపుగా ఓ ఇర‌వై త‌క్కువ‌ రెండు కోట్ల రూపాయ‌లు. యాడ్ ఫిల్మ్ మేక‌ర్ గా బాగా గుర్తింపు తెచ్చుకుని... సిద్దార్థ్ హీరోగా 180 చిత్రం తీసిన జ‌యేంద్ర ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు. ఒక ర‌కంగా చూసుకుంటే సినిమా బ‌డ్జెట్ లో సింహాభాగం హీరోయిన్ రెమ్యూన‌రేష‌న్ కే వెళుతుంది. అయితే తాను ఎంచుకున్న పాత్ర‌కి త‌మ‌న్నా అయితేనే బాగుంటుంద‌ని ఫీల‌యిన జ‌యేంద్ర... నిర్మాత‌ల‌ని ఒప్పించి మ‌రీ మిల్కీబ్యూటీ డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇప్పించాడ‌ట‌.

‘నా నువ్వే’ సినిమాలో క‌ల్యాణ్ రామ్ ప్రేమ కోసం త‌పించే రేడియో జాకీ పాత్ర‌లో న‌టిస్తోంది త‌మ‌న్నా. ఈ మ‌ధ్య‌నే విడుద‌ల‌యిన ఈ సినిమా ట్రైల‌ర్ ఒకేరోజులో 7 మిలియ‌న్ల వ్యూస్ రాబ‌ట్ట‌డం టాలీవుడ్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ప్రేమ‌క‌థ‌లో త‌మ‌న్నా- క‌ల్యాణ్ రామ్ మ‌ధ్య కెమిస్ట్రీ చూడాలంటే మే 25 దాకా వేచి చూడాల్సిందే.