Begin typing your search above and press return to search.

నా చేతిలో ఉన్నవి రెండు ప్రాజెక్టులే

By:  Tupaki Desk   |   9 Feb 2016 3:30 PM GMT
నా చేతిలో ఉన్నవి రెండు ప్రాజెక్టులే
X
సాధారణంగా సినిమా స్టార్లు.. తమ అప్ కమింగ్ ప్రాజెక్టులపై బోలెడన్ని రూమర్స్ క్రియేట్ చేయిస్తూ ఉంటారు. తమ మేనేజర్లతో రకరకాల లీకులు ఇప్పిస్తూ.. ఆ భారీ సినిమాలో, ఈ భారీ ప్రాజెక్టులో ఆఫర్ అంటూ న్యూస్ వచ్చేలా చేస్తుంటారు. కానీ ఢిల్లీ భామ తాప్సీ పన్ను ఓ డేరింగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. తనపై వస్తున్న ఓ రూమర్ ను.. నిర్దాక్షిణ్యంగా ఖండించేసింది.

యాష్ రాజ్ ఫిలింస్ తో సినిమా అంటే ఏ హీరో హీరోయిన్ కి అయినా ప్రతిష్టాత్మకమే. ఈ సంస్థ తీయనున్న ఓ ప్రాజెక్టుకు తాప్సీ ఎంపికైందని గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. వీటిపై స్పందించిన తాప్సీ.. తానిప్పుడు కేవలం రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నానని ట్వీట్ చేసింది. 'అన్ని రకాల రూమర్స్ కు చెక్ చెప్పడానికే ఈ వివరణ ఇవ్వాల్సి వస్తోంది. ప్రస్తతుం నేను ఘాజీతోపాటు రైజింగ్ సన్ ఫిలింస్ తీస్తున్న ఇంకా టైటిల్ పెట్టని ప్రాజెక్టులను మాత్రమే ఈ సమయంలో చేస్తున్నాను' అని ట్వీట్ చేసింది తాప్సీ. వైజాగ్ తీరంలో బంగాళాఖాతంలో మునిగిపోయిన ఓ సబ్ మెరైన్ కి సంబంధించిన మిస్టరీ ఘాజీ మూవీ.

ఇందులో తాప్సీ శరణార్ధిగా నటిస్తుంటే.. నావల్ ఆఫీసర్ గా రానా చేస్తున్నాడు. సంకల్ప్ అనే కొత్త డైరెక్టర్ తనే రాసుకున్న పుస్తకం బ్లూ ఫిష్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే.. ఇలా ఓ ప్రతిష్టాత్మక సంస్థలో చేస్తున్నాననే రూమర్స్ ని ఎంజాయ్ చేయకుండా.. ఇలా ఖండించడానికి చాలా డేర్ కావాలి. అఫ్ కోర్స్.. తాప్సీకి ఈ డేరింగ్ ఎక్కువే లెండి.