Begin typing your search above and press return to search.

యాంక‌ర్ క‌మ్ న‌టుడికి యాక్సిడెంట్..!

By:  Tupaki Desk   |   21 May 2018 9:52 AM GMT
యాంక‌ర్ క‌మ్ న‌టుడికి యాక్సిడెంట్..!
X
ప్ర‌ముఖ టీవీ ఛాన‌ల్ లో యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తూ అంద‌రికి సుప‌రిచితులైన మొహమ్మ‌ద్ ఖ‌య్యిం అలియాస్ లోబో ప్ర‌యాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైంది. కుమారి 21ఎఫ్‌ లో న‌టించిన లోబో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులు. సోమ‌వారం ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారు.. ఆటోను ఢీ కొంది.

ఈ ప్ర‌మాదం జ‌న‌గాం జిల్లా ర‌ఘునాథ ప‌ల్లి మండ‌లం నిడిగొండ స‌మీపంలో చోటు చేసుకుంది. ప్ర‌యాణికుల‌తో ఉన్న ఆటోను ఢీ కొన్న ఉదంతంలో కారులో ప్ర‌యాణిస్తున్న లోబోతో పాటు.. ఆటోలోని ఏడుగురికి గాయాలు అయ్యాయి. చికిత్స కోసం వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

యాక్సిడెంట్ స‌మాచారం అందుకున్న జ‌న‌గాం డీఎస్పీ ఆసుప‌త్రికి చేరుకొని గాయ‌ప‌డిన వారిని ప‌రామ‌ర్శించి వారి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని కోరారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌ను ప‌రిశీలించిన పోలీసులు కేసు న‌మోదు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంలో అంద‌రూ గాయ‌ప‌డినా.. ఎవ‌రికి తీవ్ర‌మైన గాయాలు కాక‌పోవ‌టంతో ఊపిరి పీల్చుకున్న ప‌రిస్థితి.