Begin typing your search above and press return to search.

విజయ్ మొదలుపెడితే ఎన్టీఆర్ ను పొగుడుతారా?

By:  Tupaki Desk   |   16 Oct 2018 8:05 AM GMT
విజయ్ మొదలుపెడితే ఎన్టీఆర్ ను పొగుడుతారా?
X
రెండు నెలల కిందట వరదలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన నేపథ్యంలో వివిధ సినీ పరిశ్రమలకు చెందిన సెలబ్రెటీలు పెద్ద ఎత్తున స్పందించారు. భారీగా విరాళాలు ప్రకటించారు. తెలుగు హీరోలు సైతం గట్టిగానే విరాళాలు ఇచ్చారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోనే తుఫాను బీభత్సం సృష్టించింది. శ్రీకాకుళం జిల్లా తిత్లీ తుఫాను ధాటికి అల్లాడిపోయింది. దీంతో మరోసారి సినీ హీరోలు స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. ఐతే ఆంధ్రా ప్రాంతంలో నష్టం జరిగితే.. ముందుగా స్పందించిన హీరోలు తెలంగాణ వాళ్లు కావడం విశేషం. సంపూర్ణేష్ బాబు.. విజయ్ దేవరకొండ ముందుగా రెస్పాండయ్యారు. సంపూ తన స్థాయిలో రూ.50 వేల విరాళం ప్రకటిస్తే.. విజయ్ రూ.5 లక్షలు నేరుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపాడు.

వీళ్లు స్పందించాకే మిగతా హీరోల్లో కదలిక వచ్చింది. ఐతే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాత్రం కేవలం జూనియర్ ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ లకు మాత్రమే కృతజ్ఞతలు చెప్పడం చర్చనీయాంశమవుతోంది. తిత్లీ తుఫాన్ బాధితుల కోసం ఎన్టీఆర్ రూ.15 లక్షలు.. కళ్యాణ్ రామ్ రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు. ఐతే తెలంగాణ వారై ఉండి ముందుగా స్పందించి విరాళాలు ప్రకటించిన విజయ్.. సంపూల గురించి ప్రస్తావనే లేకుండా.. నందమూరి కుటుంబం వారన్న ప్రత్యేక అభిమానంతో ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ లను పొగుడుతారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మండి పడుతున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రామ్మోహన్ నాయుడు మీద ఫైర్ అవుతున్నారు. ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ లను పొగడ్డంలో అభ్యంతరం లేదు కానీ.. ముందుగా విరాళం ప్రకటించి మిగతా వారు కూడా స్పందించక తప్పని పరిస్థితి కల్పించిన సంపూ.. విజయ్ ల గురించి ఎంపీ కచ్చితంగా ప్రస్తావించి ఉండాల్సింది.1