Begin typing your search above and press return to search.

ఇలాంటి రెస్పాన్స్ నేను ఎఫ్పూడూ చూడలేదు

By:  Tupaki Desk   |   30 July 2016 5:30 PM GMT
ఇలాంటి రెస్పాన్స్ నేను ఎఫ్పూడూ చూడలేదు
X
ఎన్నో అంచనాల మధ్య విడులైంది ‘జక్కన్న’. చాలా కాలం తరువాత సునీల్.. తన మార్కు కామెడీతో అలరించడానికి ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా మొదటి రోజే రూ.3.78 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇది ఇప్పటి వరకు సునీల్ నటించిన చిత్రాల్లోకెల్లా హయ్యెస్ట్ షేర్ కావడం విశేషం. ఇదే విషయాన్ని సునీల్ చెప్పారు. జక్కన్న మొదటి రోజు సాధించిన షేర్.. చిత్ర విశేషాల గురించి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ... ’నేను నటించిన చిత్రాల్లోకెల్లా.. జక్కన్న చిత్రం హయ్యెస్ట్ షేర్ సాధించింది. ఇది నా కెరీర్లో ఓ మైలు రాయని చెప్పొచ్చు. గతంలో నా చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చినా రాని కలెక్షన్లు.. డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘జక్కన్న’ తెచ్చుకోవడం చాలా ఆనందంగా వుంది. వీకెండ్ లో ఈ కలెక్షన్లు మరింత బాగా వుంటాయని అనుకుంటున్నా. ఈ సినిమాను బి..సి సెంటర్ల ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు వందల కాల్స్ వస్తున్నాయి. సెకెండాఫ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం... రెండో సారి కూడా చూశాం అంటూ అభిమానుల నుంచి కాల్స్ వస్తున్నాయి. గతంలో ఇలాంటి రెస్పాన్స్ నేను ఎఫ్పూడూ చూడలేదు. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు ఆశించలేం. ఎందుకంటే సబ్జెక్టు అలాంటిది. రెండు మూడు సైట్లలో తప్ప మిగతా అన్ని వెబ్ సైట్లలోనూ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. చాలా నిక్కచ్చిగా రివ్యూలు రాసినందుకు ధన్యవాదాలు చెబుతున్నా. ఈ సినిమాకు ఇంతకంటే మంచి రివ్యూలు ఆశించలేం. ఉన్నది వున్నట్టు రాశారు. నాకైతే చాలా బాగా అనిపించింది’ అన్నారు.

‘చిరంజీవి అన్నయ్య 150 సినిమాలో నాకు మంచి రోల్ లభించింది. మరో నెల రోజుల్లో ఆ చిత్రం షెడ్యూల్ లో పాల్గొనబోతున్నా. మొదట అనుకున్న రోల్ కి కాల్షీట్లు అడ్జెస్ట్ చేయలేకపోయా. దాంతో ఆ రోల్ ని వేరే వాళ్లు చేస్తున్నారు. కానీ అంతకంటే మంచి రోల్ నాకు ఇచ్చారు. ఓ నెల రోజుల్లో అన్నయ్య సినిమా షూటింగ్ లో పాల్గొంటా. అలాగే మరో నెల రోజుల్లో ‘వీడు గోల్డ్ ఎహె’ అనే సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇందులో నాలుగు పాటలు మినహా చిత్రం మొత్తం పూర్తయింది. ఆ తరువాత ‘మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు’ చిత్ర దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శత్వంలో రూపొందబోయే చిత్రం కూడా విడుదల కానుంది. దాంతో ఈ ఏడాది నాలుగు చిత్రాలు విడుదల అయినట్లవుతుంది. నేను కృష్ణాష్టమి చిత్రం విడుదల సందర్భంలోనే నాలుగు చిత్రాలతో ఈ ఏడాది మీ ముందుకొస్తున్నా అన్నాను. దాన్ని నిలబెట్టుకోబోతున్నా’ అన్నారు.

‘ఇక నుంచి ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీస్ లోనే నటించాలనుకుంటున్నా. అలాంటి స్టోరీలతోనే రావాలని దర్శకులను కోరుతున్నా. కామెడీ వున్న సినిమాల్లో అవసరమైతేనే యాక్షన్ సన్నివేశాలుంటే చేస్తా. అంతేకానీ పూర్తి స్థాయి యాక్షన్ చిత్రాల్లో మాత్రం నటించను. సీరియ‌స్ గా ఉండే సినిమాలు చేయ‌కూడ‌దు అని నిర్ణ‌యించుకున్నాను. న‌న్ను ఆడియ‌న్స్ ఎలా చూడాల‌ని కోరుకుంటున్నారో అలా.. కామెడీ క‌థ‌ల‌కే ప్రాధాన్య‌మివ్వాల‌ని నిర్ణ‌యించుకున్నా. అందుక‌నే బిచ్చ‌గాడు సినిమా రీమేక్ కోసం న‌న్ను అడిగినా నేను చేయ‌లేదు’’ అని సునీల్ చెప్పాడు. జక్కన్నలో చేసిన కామెడీ సన్ని వేశాలకు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ బాగుంది. ముఖ్యంగా పంచ్ డైలాగులను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సిచ్యుయేషన్ కి తగ్గట్టుగా ప్రాసలతో కూడిన పంచ్ లుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. వీటికి ఎప్పుడూ ఆదరణ వుంటుంది. నాకు ప్రభాస్ కు పనిచేసే కాస్ట్యూమ్ డిజైన్ భాస్కర్ కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేస్తున్నారు. అందుకే డిజైన్ వేర్ అంత బాగా వుంటోంది. ఈ చిత్రంలోనైతే కొన్ని రకాల ఫ్యాషన్ వేర్ ను నేనే చూయించా. అందుకు తగ్గట్టుగానే అతను డిజైన్ చేశారు’ అన్నారు.

‘త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా కచ్చితంగా వుంటుంది. కానీ ఎప్పుడనేది చెప్పలేం. గతంలో ‘బంతి’ అనే సినిమాను అనుకున్నాం. అయితే అది ఈ ట్రెండ్ కి తగ్గట్టుగా చాలా మార్చాల్సి వుంది. ఆయన దర్శకత్వంలో నటిస్తే.. ఇక నా జీవితం సార్థకం అయినట్టే లెక్క. అంతకంటే నాకు మరొక అదృష్టం వుండదు. రాజేంద్రప్రసాద్ నటించిన లేడీస్ టైలర్ లాంటి సినిమాలు చేయాలని వుంటుంది. కానీ అలాంటి సబ్జెక్టులతో వచ్చే దర్శకులేరీ?’ అన్నారు.