Begin typing your search above and press return to search.

నాగార్జునతో గొడవ.. సుమంత్ స్పందన ఇది

By:  Tupaki Desk   |   10 Dec 2017 8:45 AM GMT
నాగార్జునతో గొడవ.. సుమంత్ స్పందన ఇది
X
‘ప్రేమకథ’ సినిమాతో తన మేనల్లుడు సుమంత్‌ ను హీరోగా పరిచయం చేసింది అక్కినేని నాగార్జునే. ఆ తర్వాత సుమంత్ కెరీర్ స్లంప్ లో ఉన్న టైంలో మరోసారి ‘సత్యం’ సినిమా ప్రొడ్యూస్ చేసి అతణ్ని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ నాగార్జునకు.. సుమంత్ కు పడదని.. వీళ్లిద్దరి మధ్య విభేదాలున్నాయని.. ఏఎన్నార్ మరణానంతరం ఆస్తుల పంపకం దగ్గర ఇద్దరి మధ్య తేడా వచ్చిందని రకరకాల రూమర్లు ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఐతే ఇటు నాగార్జున కానీ.. అటు సుమంత్ కానీ ఎప్పుడూ ఈ రూమర్ల గురించి స్పందించింది లేదు. ఐతే తన కొత్త సినిమా ‘మళ్ళీ రావా’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక వీడియో ఇంటర్వ్యూలో సుమంత్ ఈ విషయమై స్పందించాడు.

తనకు తన మావయ్యకు విభేదాలున్నాయన్న మాట శుద్ధ అబద్ధమని సుమంత్ అన్నాడు. అసలు బయట ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నట్లు కూడా తనకు తెలియదని సుమంత్ అన్నాడు. తాను తన మావయ్యతో రోజూ మాట్లాడతానని.. తరచుగా కలుస్తుంటానని చెప్పాడు. ఐతే గతంతో పోలిస్తే ఇప్పుడు కలవడం కొంచెం తగ్గిందని చెప్పాడు. తామందరం ఒక ఫ్యామిలీ అని చెప్పాడు. అఖిల్.. చైతూ.. రానా.. ఇలా తన ఫ్యామిలీ హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉందని.. వీరితో కలిసి సినిమాలు చేయాలని కూడా అనుకుంటున్నానని సుమంత్ చెప్పాడు. తాను క్యారెక్టర్.. విలన్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అని సుమంత్ చెప్పాడు. ‘మనం’ సినిమాకు నంది అవార్డు రాకపోవడంపై వివాదం చెలరేగడం గురించి స్పందిస్తూ.. ఇలాంటివి మామూలే అని.. హాలీవుడ్లో ఎందరో గొప్ప దర్శకులకు ఆస్కార్ అవార్డులు రాలేదని.. కొందరికి లేటుగా వచ్చాయని.. కాబట్టి ఈ వివాదం గురించి తాను కామెంట్ చేయనని.. తమ సినిమాకు ప్రేక్షకులు అద్భుతమైన విజయాన్నందించారని.. అది చాలని సుమంత్ అన్నాడు.