Begin typing your search above and press return to search.

ఈసారి సుకుమార్ థ్రిల్ చేస్తాడట

By:  Tupaki Desk   |   24 May 2018 11:30 PM GMT
ఈసారి సుకుమార్ థ్రిల్ చేస్తాడట
X
రంగస్థలం సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ సుకుమార్. రూ. 200 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ మూవీ తెలుగు సినిమా స్టామినా ఏమిటో ప్రూవ్ చేసింది. సుకుమార్ సత్తా టాలీవుడ్ మరోసారి గుర్తించింది. దీంతో ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై అంతటా ఆసక్తి పెరిగింది.

వరసగా డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వస్తున్న సుకుమార్ ఈసారి థ్రిల్లర్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. సుకుమార్ దగ్గర చాలామందే అసిస్టెంట్లే ఉన్నారు. వాళ్లలో ఒకరు చెప్పిన సబ్జెక్టు సుకుమార్ కు బాగా నచ్చిందట. అతడు చెప్పిన స్టోరీ లైన్ ను డెవలప్ చేసి స్క్రిప్ట్ రెడీ చేయాలని తన టీంకు సూచించాడని లేటెస్ట్ టాక్. సుకుమార్ తన తరవాత సినిమా మహేష్ బాబుతో తీయనున్నాడు. ఇంతకుముందు మహేష్ తో 1 నేనొక్కడినే సినిమా తీశాడు. ఆ సినిమాలో సుకుమార్ కథ కొత్తగా చెప్పడానికి ప్రయత్నించినా ప్రేక్షకులకు నచ్చలేదు. మహేష్ కు బాకీ తీర్చేసేందుకు ఈసారి హిట్ తీయాలని సుకుమార్ గట్టి పట్టుదలతోనే ఉన్నాడు.

అందుకోసమే డిఫరెంట్ కథ కోసం వెతుకుతూ ఈ థ్రిల్లర్ సబ్జెక్టుపై మనసు పడ్డాడని తెలుస్తోంది. స్క్రిప్ట్ సిద్ధమైతే సినిమా మొదలుపెట్టేందుకు మమేష్ సిద్ధంగానే ఉన్నాడని తెలుస్తోంది. సుకుమార్ తో రంగస్థలం సినిమా తీసిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థే ఈ సినిమా కూడా నిర్మించనుంది.