Begin typing your search above and press return to search.

రష్మిక కోసం రామలక్ష్మిని మించి..!

By:  Tupaki Desk   |   21 Sep 2019 5:30 PM GMT
రష్మిక కోసం రామలక్ష్మిని మించి..!
X
'రంగస్థలం'తో గత ఏడాది బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ దక్కించుకున్న దర్శకుడు సుకుమార్‌. నాన్‌ బాహుబలి రికార్డును దక్కించుకున్న రంగస్థలం చిత్రంలో రామ్‌ చరణ్‌ మరియు సమంత పాత్రలను దర్శకుడు సుకుమార్‌ అద్బుతంగా మలిచాడు. సమంత పాత్రను ఒక పల్లెటూరు గడుసరి అమ్మాయిగా మలిచిన తీరు అద్బుతం అని చెప్పాలి. రంగస్థలం చిత్రంలో సమంత పోషించిన రామలక్ష్మి పాత్ర సినిమాకే హైలైట్‌ గా నిలిచింది. సమంత కెరీర్‌ బెస్ట్‌ పాత్రల్లో ఒక్కటిగా నిలిచింది. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్‌ అల్లు అర్జున్‌ తో తెరకెక్కించబోతున్న చిత్రం కోసం రామలక్ష్మిని మించిన పాత్రను తయారు చేస్తున్నాడట.

రంగస్థలం మాదిరిగానే అల్లు అర్జున్‌ తో తెరకెక్కించబోతున్న సినిమా కూడా పల్లెటూరు నేపథ్యంలో ఉండబోతుందట. ఈ చిత్రం కోసం పల్లెటూరు అమ్మాయి పాత్రను దర్శకుడు సుకుమార్‌ రామలక్ష్మి పాత్ర తరహాలోనే ఉండేలా ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్న నటించబోతుంది. అందుకు సంబంధించిన చర్చలు కూడా దాదాపుగా పూర్తి అయ్యాయి. చాలా బిజీగా ఉన్నా కూడా రష్మిక బన్నీ మరియు సుకుమార్‌ తో మూవీ వదులుకోలేక పోయింది. ఆమె డేట్లు అడ్జెస్ట్‌ చేసి మరీ సినిమాకు ఒప్పుకుందని సమాచారం అందుతోంది.

పల్లెటూరు అమ్మాయి పాత్రలో సమంత సెట్‌ అయినంతగా రష్మిక సెట్‌ అయ్యేనా చూడాలి. దర్శకుడు ఎవరినైనా పాత్రలో లీనం చేయగలడు. అందుకే రామలక్ష్మిని మించి రష్మిక పాత్రను ప్రేక్షకులకు నచ్చే విధంగా డిజైన్‌ చేస్తాడని సుకుమార్‌ పై ఇప్పటి నుండే అంచనాలు పెరుగుతున్నాయి. రష్మిక ప్రస్తుతం మహేష్‌ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తోంది. ఆ చిత్రం తర్వాత బన్నీ.. సుకుమార్‌ ల మూవీలో నటించబోతుంది.