Begin typing your search above and press return to search.
సుకుమార్ ఒకేసారి రెండు ప్రాజెక్ట్స్..!
By: Tupaki Desk | 23 Sep 2018 7:21 AM GMTప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇటీవలే ‘రంగస్థలం’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ను దక్కించుకున్న విషయం తెల్సిందే. నాన్ బాహుబలి రికార్డును దక్కించుకున్న రంగస్థలం చిత్రంతో సుకుమార్ మరింత స్టార్ డంను దక్కించుకున్నాడు. ‘రంగస్థలం’ చిత్రం తర్వాత సుకుమార్ చేయబోతున్న మూవీ ఇప్పటికే ఫిక్స్ అయిన విషయం తెల్సిందే. మహేష్బాబు 26వ ప్రాజెక్ట్ ను సుకుమార్ చేపట్టాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ లోపుగా సుకుమార్ తన బ్యానర్ లో బ్యాక్ టు బ్యాక్ రెండు చిన్న చిత్రాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
సుకుమార్ రైటింగ్స్ మరియు మైత్రి మూవీస్ బ్యానర్ కలిసి మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక చిత్రాన్ని ప్లాన్ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ను జరుపుతున్నారు. మరో వైపు సుకుమార్ గీతా ఆర్ట్స్ 2 తో కూడా కలిసి మరో సినిమాను చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న ప్రతాప్ దర్శకత్వంలో ఈ మూవీ ఉండబోతుంది.
ప్రస్తుతం బన్నీ వాసు మరియు ప్రతాప్ కలిసి స్క్రిప్ట్ వర్క్ తో పాటు నటీ నటుల ఎంపిక పనిలో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండు చిన్న చిత్రాలకు సుకుమార్ స్వయంగా స్టోరీ లైన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక వైపు విభిన్న నేపథ్యంలో భారీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ - మరో వైపు చిన్న చిత్రాలను కంటిన్యూగా నిర్మిస్తున్న సుకుమార్ ఇతర దర్శకులకు ఆదర్శనీయంగా మారుతున్నాడు. ఇప్పటికే సుకుమార్ బ్యానర్ లో వచ్చిన ‘కుమారి 21ఎఫ్’ మరియు ‘దర్శకుడు’ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్న ఈ రెండు చిత్రాలు కూడా సక్సెస్ ను దక్కించుకుంటాయో చూడాలి.
సుకుమార్ రైటింగ్స్ మరియు మైత్రి మూవీస్ బ్యానర్ కలిసి మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక చిత్రాన్ని ప్లాన్ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ను జరుపుతున్నారు. మరో వైపు సుకుమార్ గీతా ఆర్ట్స్ 2 తో కూడా కలిసి మరో సినిమాను చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న ప్రతాప్ దర్శకత్వంలో ఈ మూవీ ఉండబోతుంది.
ప్రస్తుతం బన్నీ వాసు మరియు ప్రతాప్ కలిసి స్క్రిప్ట్ వర్క్ తో పాటు నటీ నటుల ఎంపిక పనిలో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండు చిన్న చిత్రాలకు సుకుమార్ స్వయంగా స్టోరీ లైన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక వైపు విభిన్న నేపథ్యంలో భారీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ - మరో వైపు చిన్న చిత్రాలను కంటిన్యూగా నిర్మిస్తున్న సుకుమార్ ఇతర దర్శకులకు ఆదర్శనీయంగా మారుతున్నాడు. ఇప్పటికే సుకుమార్ బ్యానర్ లో వచ్చిన ‘కుమారి 21ఎఫ్’ మరియు ‘దర్శకుడు’ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్న ఈ రెండు చిత్రాలు కూడా సక్సెస్ ను దక్కించుకుంటాయో చూడాలి.