Begin typing your search above and press return to search.

ఫ్రీగా చేయించుకున్నవాళ్లే ఎక్కువన్న హీరో

By:  Tupaki Desk   |   20 Sep 2018 2:30 PM GMT
ఫ్రీగా చేయించుకున్నవాళ్లే ఎక్కువన్న హీరో
X
రేపు విడుదల కాబోతున్న నన్ను దోచుకుందువటే రిజల్ట్ పట్ల హీరో సుధీర్ బాబు రెండు రకాలుగా టెన్షన్ తో ఉన్నాడు. సమ్మోహనం సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేయటం ఒకటి కాగా నిర్మాతగా తన మొదటి ప్రాజెక్ట్ కావడం మరొకటి. దీని ప్రమోషన్ లో భాగంగా మీడియాతో బాగా యాక్టివ్ గా ఉన్న సుధీర్ కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలు పంచుకున్నాడు. ఇప్పటిదాకా కెరీర్లో చేసిన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు చాలా తక్కువని సగం నిర్మాతలు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి ఫ్రీగా చేయించుకున్నారని షాక్ ఇచ్చాడు. మొత్తం లెక్కేస్తే సినిమాల ద్వారా వచ్చిన ఆదాయం చాలా తక్కువగా ఉంటుందట. ఇక నిర్మాతగా మారడం గురించి చెబుతూ మొదలుపెట్టినప్పుడు ఉన్న ప్రొడ్యూసర్ వేరే కారణాల వల్ల డ్రాప్ అయితే కథ దర్శకుడి మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నట్టు చెప్పడం విశేషం. ఖచ్చితంగా ప్రేక్షకులు మెచ్చే సినిమా అవుతుంది కాబట్టే సాహసం చేశానని క్లారిటీ ఇచ్చాడు.

ఇక కృష్ణ గారి కుటుంబంలో మూడు బ్యానర్లు కాకుండా స్వంతంగా మరొకటి స్టార్ట్ చేయటం గురించి చెబుతూ స్వంతంగా తన ఉనికిని గుర్తింపును చాటుకునే ప్రయత్నంలో ఉన్నానని అందుకే పద్మాలయ-మహేష్ బాబు-ఇందిరా అంటూ పెద్ద సంస్థలు తనకు అందుబాటులో ఉన్నా కాదనుకుని స్వంతంగా స్టార్ట్ చేసానని చెప్పాడు. నాన్న వ్యాపారంలో ఉంటే ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇంటి వచ్చి హ్యాపీగా ఉండొచ్చని కానీ సినిమాల మీద ప్యాషన్ తో రిస్క్ చేసి మరీ ఈ ఫీల్డ్ లో ఉన్నానన్న సుధీర్ రేపు ఫలితంపై చాలా నమ్మకంగా ఉన్నాడు. మరో పదిహేను రోజుల్లో సుధీర్ మరోసినిమా వీర భోగ వసంత రాయలు కూడా విడుదల అవుతుంది. సమ్మోహనం సక్సెస్ తో హుషారుగా ఉన్న సుధీర్ కు ఇప్పుడీ రెండు కూడా హిట్ అయ్యాయంటే ఇంకాస్త గట్టిగా సెటిలవ్వడానికి అవకాశం దక్కుతుంది.