Begin typing your search above and press return to search.

భార్యాభర్తల మధ్య ఎందుకని సైడ్ అయ్యా!

By:  Tupaki Desk   |   21 Sep 2018 4:10 AM GMT
భార్యాభర్తల మధ్య ఎందుకని సైడ్ అయ్యా!
X
'సమ్మోహనం' తో అందరి ప్రశంసలు అందుకున్న సుధీర్ బాబు తాజాగా 'నన్ను దోచుకుందువటే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో సుధీర్ బాబు నిర్మాతగా తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నాడు. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకేత్తించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించాడు.

ఈ సినిమాను మొదట సెప్టెంబర్ 13 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినా లాస్ట్ మినిట్ లో సెప్టెంబర్ 21 కి వాయిదా వేయడం జరిగింది. చైతు సినిమా 'శైలజా రెడ్డి అల్లుడు' సడెన్ గా 13 కు షెడ్యూల్ చేయడంతో రిస్క్ ఎందుకని సుధీర్ బాబు తన సినిమా విడుదల తేదీని మార్చాడు. ఈ విషయం గురించి మాట్లాడుతూ "ఈ సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేస్తాను అని అందరికంటే ముందు అనౌన్స్ చేశాను. కానీ వాళ్ల సినిమాలు సమయానికి పూర్తి కాకపోవడంతో నేను అనుకున్న డేట్ ను లాక్ చేశారు. మరో కారణం.. వైఫ్ అండ్ హస్బెండ్ ఫైట్ లో వేలు పెట్టకూడదు. 'శైలజారెడ్డి అల్లుడు'... 'యూ టర్న్' సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైట్ చేసుకుంటూ ఉంటే మనం మధ్యలోకి వెళ్లి వేలు పెట్టి కాల్చుకోకూడదు అని సైడ్ అయ్యాను" అన్నాడు.

"నిజమే.. భార్య భర్తల మధ్య అసలు దూరకూడదు".. జోక్ గా చెప్పినా జీవిత సత్యమే చెప్పాడు సుధీర్ బాబు. ఇదిలా ఉంటే.. 'నన్ను దోచుకుందువటే' ప్రేక్షకులకు తప్పనిసరిగా నచ్చుతుందని నమ్మకం ఉందన్నాడు. తను నిర్మాతగా సక్సెస్ కావడం కంటే తన బ్యానర్ నుండి ఒక మంచి సినిమా రావాలని.. ఈ సినిమాకు పనిచేసిన వారికి మంచి పేరు రావాలనే ఆలోచన తమకుందని అన్నాడు.