Begin typing your search above and press return to search.

శ్రీను డ్రగ్స్ నూ వాడుకున్నారు!

By:  Tupaki Desk   |   14 Nov 2018 7:38 AM GMT
శ్రీను డ్రగ్స్ నూ వాడుకున్నారు!
X
ఈ మధ్య ట్రాక్ రికార్డు ఎలా ఉంది అనేది పక్కన పెడితే టాలీవుడ్ లో ఒక కొత్త తరహా కామెడీ ఒరవడికి శ్రీకారం చుట్టింది దర్శకుడు శ్రీను వైట్లనే. తన మార్కు సినిమా లేక గత కొంత కాలంగా ఇబ్బంది పడుతున్న శీను మాస్ మహారాజా రవితేజతో చేస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ మీద మంచి అంచనాలే ఉన్నాయి. ప్రమోషన్ లో సైతం శీను చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. దూకుడు తర్వాత అంత కస్టపడి వర్క్ అవుట్ చేసిన కథగా నొక్కి చెబుతున్నాడు. ట్రైలర్ ను బట్టి ఇది రివెంజ్ ఫార్ములాగా అనిపిస్తున్నా తన స్టైల్ అఫ్ కామెడీతో వినోదానికి లోటు లేకుండా ఉంటుందని హామీ ఇస్తున్నాడు.

వర్తమానానికి సంబంధించిన ఇష్యూలను తెలివిగా వాడుకునే శీను వైట్ల ఇందులో సైతం అలాంటివి చొప్పించినట్టు సమాచారం. ఆ మధ్య టాలీవుడ్ ను కొద్దిరోజుల పాటు ఊపేసిన డ్రగ్స్ రాకెట్ వ్యవహారాన్ని ఇందులో మంచి ఫన్ కోసం తీసుకున్నట్టు తెలిసింది. వాటి తాలూకు బైట్లు కూడా ట్రైలర్ లో ఉన్నాయి కూడా. ఇది అమర్ అక్బర్ ఆంటోనీలో ఓ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందట. రవితేజతో పాటు వెన్నెల కిషోర్-రఘుబాబు-జయప్రకాశ్ రెడ్డి-సత్య తదితరులు చేసే కామెడీ హిలేరియస్ గా ఉంటుందని టాక్. అదే నిజమైతే శీను వైట్ల బ్రాండ్ మళ్ళి వచ్చేసినట్టే.

విచారణ పేరుతో సిట్ బృందాలు అప్పట్లో టాలీవుడ్ ప్రముఖులను గంటల తరబడి విచారణ చేయడం మీడియాలో బాగా హై లైట్ అయ్యింది. రోజుల తరబడి దీని గురించిన చర్చలే జరిగాయి. సో ఆ ట్రాక్ ని కామెడీకు తీసుకోవాలన్న శీను ఆలోచన మంచిదే. ఎల్లుండి విడుదల కాబోతున్న ఈ మూవీ హిట్ తో 2018ని ముగించాలని చూస్తున్నాడు రవితేజ. టాక్సీవాలా పోటీ ఉన్నప్పటికీ అది తప్ప బరిలో ఇంకే సినిమాలు లేకపోవడంతో రవితేజ ఈ అవకాశాన్ని వాడుకుంటే కనక ఫ్యాన్స్ కి పండగే