Begin typing your search above and press return to search.

10 టికెట్లు 15 వేల డాలర్లు..ఎవరా శ్రీమంతులు

By:  Tupaki Desk   |   4 Aug 2015 9:45 AM GMT
10 టికెట్లు 15 వేల డాలర్లు..ఎవరా శ్రీమంతులు
X
తమ హీరోల మీద అభిమానం చాటుకోవడానికి రకరకాల మార్గాలు చూస్తుంటారు అభిమానులు. అందుకోసం బెనిఫిట్ షోలకు సంబంధించి టికెట్ల వేలం కూడా నిర్వహిస్తుంటారు. ఈ వేలం పాటలో ఎంత ఎక్కువకు టికెట్ కొంటే అంత అభిమానం ఉన్నట్లు. ఈ విషయంలోనూ రికార్డులు మెయింటైన్ చేసేవాళ్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా యుఎస్ లో ఇలాంటి వేలం పాటలు నడుస్తుంటాయి. తాజాగా మహేష్ బాబు సినిమా ‘శ్రీమంతుడు’ విడుదలదర్భంగానూ ప్రీమియర్ షో టికెట్లను భారీ ధర పెట్టారు కొన్నారు కొందరు శ్రీమంతులు. కేవలం పది టికెట్ల కోసం ఏకంగా 15 వేల డాలర్లు.. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు తొమ్మిదన్నర లక్షలు రూపాయలు ఖర్చు చేయడం విశేషం. బహుశా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఇదో రికార్డని చెప్పాలి.

ఐతే పది టికెట్ల కోసం అంత పెట్టింది ఎవరా అని ఆరా తీస్తే వాళ్లు శ్రీమంతుడు నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని మిత్రులని తెలిసింది. తమ మిత్రుడు తొలిసారి నిర్మాతగా అది కూడా మహేష్ సినిమాతో పరిచయమవుతున్న నేపథ్యంలో బెనిఫిట్ షో టికెట్లను ఇంత భారీ మొత్తం పెట్టి కొన్నట్లు తెలుస్తోంది. మామూలుగానే మహేష్ కు యుఎస్ లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. పైగా మైత్రి మూవీస్ వాళ్లు యుఎస్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వచ్చిన వాళ్లే. దీంతో శ్రీమంతుడు అక్కడ భారీ స్థాయిలో, విపరీతమైన హైప్ మధ్య విడుదలవుతోంది. బాహుబలి సినిమాకు దీటుగా 150కి పైగా స్క్రీన్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం విశేషం. యుఎస్ లోని చాలా స్క్రీన్స్ లో ఈ నెల ఆరో తారీఖునే భారీ స్థాయిల ప్రిమియర్స్ ఏర్పాటు చేస్తున్నారు.