Begin typing your search above and press return to search.

బాల‌య్య‌కో న్యాయం..నాకో న్యాయ‌మా?:శ్రీ‌రెడ్డి

By:  Tupaki Desk   |   21 April 2018 9:57 AM GMT
బాల‌య్య‌కో న్యాయం..నాకో న్యాయ‌మా?:శ్రీ‌రెడ్డి
X
జ‌న‌సేన అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై న‌టి శ్రీ‌రెడ్డి కొద్ది రోజులుగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. వ‌ర్మ స‌ల‌హాతో ప‌వ‌న్ ను అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించిన శ్రీ‌రెడ్డి ....ఆ తర్వాత ప‌వ‌న్ కు, ఆయ‌న త‌ల్లికి క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. అయితే, నిన్న ఫిల్మ్ చాంబ‌ర్ లో ప‌వ‌న్ హ‌డావిడి చేసిన త‌ర్వాత‌....ప‌వ‌న్ పై త‌న ఫేస్ బుక్ లో వ‌రుస పోస్టుల‌తో విరుచుకుప‌డింది. అయితే, ప‌వ‌న్ తో పాటు హిందూపురం ఎమ్మెల్యే - సినీ న‌టుడు బాల‌కృష్ణ పై కూడా శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ప‌వ‌న్ తో పాటుగా బాలయ్యను కూడా టార్గెట్ చేసింది. నిన్న జ‌రిగిన స‌భ‌లో బాల‌కృష్ణ బూతులు మాట్లాడారని....కానీ అవి ఎవ‌రికీ వినిపించ‌వ‌ని శ్రీ‌రెడ్డి ఎద్దేవా చేసింది. త‌ను ఆ మాట‌న్నందుకు ట్రోల్ చేశార‌ని, ఇప్పుడు బాల‌కృష్ణ‌ను ఏమీ అన‌డం లేద‌ని మండిప‌డింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడిని ఉద్దేశించి నిన్న బాల‌య్య షాకింగ్ కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ వ్యాఖ్య‌ల‌పై పెను దుమారం రేగింది. ఇదే వ్య‌వ‌హారంపై శ్రీ‌రెడ్డి కూడా స్పందించింది. `` ఈ రోజు స‌భ‌లో మోదీని బాల‌య్య మ‌ఖ్ఖీ చూస్ అన్నారు....ఎవ‌రేం అంటారో చూస్తా...`` అని శ్రీ‌రెడ్డి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. త‌న‌పై బూతుల‌తో విరుచుకుప‌డేవారు బాలయ్య మాట్లాడిన మాటలు పట్టించుకోరా అని ప్రశ్నించింది. ``ఈ రోజు బాలయ్య బాబు స్పీచ్ ఎంత మంది విన్నారు ?? ఎంత పద్దతిగా, అసలు ఏ మాత్రం బూతులు లేకుండా ఉంది కదా !! నన్ను మాత్రం ఒంటరి ఆడ పిల్లని అని మీ నోటికొచ్చినట్లు తిట్టారు కదా, ఇప్పుడు మీ నోర్లు పడిపోయినియ్య ??`` అని శ్రీ‌రెడ్డి ట్వీట్ చేసింది. ప్ర‌స్తుతం శ్రీ‌రెడ్డి ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.