Begin typing your search above and press return to search.
సెలబ్రిటీ సింగర్ కు భర్త వేధింపులు
By: Tupaki Desk | 24 Nov 2015 2:11 PM GMTకుటుంబ కలహాలు - భార్యభర్తల విబేధాలతో పోలీసులను ఆశ్రయించే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు సామాన్యుల్లో ఉన్న ఈ బేధాభిప్రాయాలు, ఇపుడు సెలబ్రిటీలకు సైతం ఇబ్బందిగా మారాయి. ఇష్టపడి వివాహమాడిన సెలబ్రిటీకి సైతం భాగస్వామితో సమస్యలు తప్పకపోవడం బాధాకరం.
కుటుంబపరమైన గీతాలతో పాపులర్ అయిన గాయని కౌసల్యకు తాజాగా ఇదే పరిస్థితి ఎదురైంది. తన భర్త వేధిస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీ కోసం సినిమాతో ప్లేబ్యాక్ సింగర్ గా కెరీర్ ప్రారంభించిన కౌసల్య చిన్ననాటి స్నేహితుడైన బాలసుబ్రహ్మణ్యాన్ని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. పలు సినిమాలకు పాటలు పాడటంతో పాటు స్టేజి కార్యక్రమాలలో కూడా ఆమె పాటలు పాడటం ద్వారా పాపులర్ అయ్యారు. దాదాపు 25 ఏళ్లుగా గాయనిగా ఉన్నారు.
అయితే ఇప్పటివరకు వారి వైవాహిక విబేధాలు బయటపడనప్పటికీ తాజాగా కౌసల్య సంజీవరెడ్డి నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన భర్త వేధిస్తున్నారని ఆమె కంప్లైంట్ ఇచ్చారు. దీంతో కౌసల్య భర్త బాలసుబ్రహ్మణ్యంను పోలీసులు పిలిచి కౌన్సెలింగ్ చేశారు. ఇదిలాఉండగా.... కౌసల్య సొంత ఊరు గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం. నాగార్జున సాగర్ లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో పదో తరగతి వరకు చదివారు. గుంటూరు మహిళా కళాశాలలో ఇంగ్లీషు లిటరేచర్, కర్ణాటక సంగీతాల్లో డిగ్రీ పూర్తిచేశారు. ఇదిలాఉండగా భార్యభర్తల మధ్య విబేధాలకు కారణం తెలియరాలేదు.
కుటుంబపరమైన గీతాలతో పాపులర్ అయిన గాయని కౌసల్యకు తాజాగా ఇదే పరిస్థితి ఎదురైంది. తన భర్త వేధిస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీ కోసం సినిమాతో ప్లేబ్యాక్ సింగర్ గా కెరీర్ ప్రారంభించిన కౌసల్య చిన్ననాటి స్నేహితుడైన బాలసుబ్రహ్మణ్యాన్ని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. పలు సినిమాలకు పాటలు పాడటంతో పాటు స్టేజి కార్యక్రమాలలో కూడా ఆమె పాటలు పాడటం ద్వారా పాపులర్ అయ్యారు. దాదాపు 25 ఏళ్లుగా గాయనిగా ఉన్నారు.
అయితే ఇప్పటివరకు వారి వైవాహిక విబేధాలు బయటపడనప్పటికీ తాజాగా కౌసల్య సంజీవరెడ్డి నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన భర్త వేధిస్తున్నారని ఆమె కంప్లైంట్ ఇచ్చారు. దీంతో కౌసల్య భర్త బాలసుబ్రహ్మణ్యంను పోలీసులు పిలిచి కౌన్సెలింగ్ చేశారు. ఇదిలాఉండగా.... కౌసల్య సొంత ఊరు గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం. నాగార్జున సాగర్ లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో పదో తరగతి వరకు చదివారు. గుంటూరు మహిళా కళాశాలలో ఇంగ్లీషు లిటరేచర్, కర్ణాటక సంగీతాల్లో డిగ్రీ పూర్తిచేశారు. ఇదిలాఉండగా భార్యభర్తల మధ్య విబేధాలకు కారణం తెలియరాలేదు.