Begin typing your search above and press return to search.

‘మహానటి’ సెట్లో సింగీతం భావోద్వేగం

By:  Tupaki Desk   |   22 Oct 2017 1:30 AM GMT
‘మహానటి’ సెట్లో సింగీతం భావోద్వేగం
X
ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘మహానటి’ ఒకటి. అలనాట నటి సావిత్రి జీవిత కథకు వెండితెర రూపం ఇచ్చే ప్రయత్నం చేస్తోంది వైజయంతీ మూవీస్. గతంలో భారీ సినిమాలు తీసి మధ్యలో జోరు తగ్గించేసిన అశ్వినీదత్.. ఈ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఆయన కూతుళ్లు ప్రియాంక.. స్వప్నల నిర్మాణ పర్యవేక్షణలో అల్లుడు నాగ్ అశ్విన్ (ప్రియాంక భర్త) ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దీన్ని ఓ క్లాసిక్ లాగా తీర్చిదిద్దడానికి చిత్ర బృందం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇటీవలే దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ‘మహానటి’ సెట్ కు వచ్చినట్లు సమాచారం.

సావిత్రి కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమాగా చెప్పుకోదగ్గ ‘మాయాబజార్’కు సంబంధించిన సన్నవేశాలు చిత్రీకరిస్తున్న సమయంలోనే సింగీతం వచ్చారట. ఈ సన్నివేశాల్లో సింగీతం పాత్ర కూడా ఉండటం విశేషం. కె.వి.రెడ్డి అసిస్టెంటుగా సింగీతం పాత్రను యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ పోషిస్తున్నాడట. కె.వి.రెడ్డి పాత్రను డైరెక్టర్ క్రిష్ చేస్తున్నాడు. ‘మాయాబజార్’కు సంబంధించిన సన్నివేశాలు తీస్తుండగా సింగీతం భావోద్వేగానికి గురయ్యారట. అప్పటి జ్నాపకాల్ని ఆయన షేర్ చేసుకున్నారట. చిత్ర బృందాన్ని ఉద్దేశించి ఆయన చిన్న పాటి ప్రసంగం కూడా చేస్తూ తన జ్నాపకాల్ని పంచుకున్నారట. ‘మహానటి’లో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ చేస్తున్న సంగతి తెలిసిందే.