Begin typing your search above and press return to search.

డైరెక్టర్ ని శింబు అలా బెదిరించాడా!?

By:  Tupaki Desk   |   21 Feb 2018 10:58 AM GMT
డైరెక్టర్ ని శింబు అలా బెదిరించాడా!?
X
కోలీవుడ్ హీరో శింబు వరుస వివాదాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బూతులతో పాటను ట్యూన్ చేయించి పాడేయడం.. ఏఏఏ చిత్రం ఫ్లాప్ అయేందుకు కారణం అంటూ నిర్మాత మైకేల్ రాయప్పన్ ఆరోపించడం వంటివి వరుసగా జరిగాయి. అయితే.. మైకేల్ రాయప్పన్ నిర్మాతగా.. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఏఏఏ.. కోలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్లాపులలో ఒకటిగా నిలిచింది.

ఈ వివాదం సద్దుమణిగింది అని.. ఇక ఎవరూ పట్టించుకోకపోవచ్చని అనుకుంటున్న సమయంలో.. ఇప్పుడో ఆడియో ఇంటర్నెట్ లో లీక్ అయింది. ఇందులో హీరో శింబు.. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ల సంభాషణ వినిపిస్తుంది. తన గురించి తెలిసి కూడా ఆ నిర్మాతకు ఎందుకు సపోర్ట్ చేశావంటూ శింబు నిలదీసిన వైనం కనిపిస్తుంది. ఏకంగా 20 నిమిషాలకు పైగా సాగే ఈ సుదీర్ఘమైన టేపు అంతా.. ఇదే వివాదానికి సంబంధించిన పలు కోణాలను ప్రస్తావిస్తుంది. మొత్తం మీద శింబు వెర్షన్ అయితే.. మరో సినిమా చేసేందుకు ఆ నిర్మాత అవకాశం ఇవ్వడంతో.. కావాలనే తనను కార్నర్ చేసినట్లుగా శింబు ఆరోపణలు వినిపిస్తాయి.

అధిక్ రవిచంద్రన్ అయితే.. ఆడియో మొత్తంలో ఈ హీరోను కన్విన్స్ చేసేందుకు.. అప్పటి సిట్యుయేషన్ వివరించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ టేపు ఇప్పుడు కోలీవుడ్ లో సెన్సేషన్ అవుతోంది. ఇంతకీ నిజంగా ఈ ఆడియోలో మాట్లాడింది శింబు.. అధిక్ రవిచంద్రన్ లేనా.. లేకపోతే వారి వాయిస్ లను మిమిక్రీ చేసి ఇలా వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారా అనే డౌట్స్ కూడా వినిపిస్తున్నాయి.