Begin typing your search above and press return to search.

మిసెస్ మిట్టల్ గా మారనున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   13 Dec 2018 5:41 AM GMT
మిసెస్ మిట్టల్ గా మారనున్న హీరోయిన్
X
పెళ్ళి మీద ఎన్నో జోకులుంటాయి. మన ఆప్తులు ముకేష్ యాడ్ లాంటి ఎన్నో భయంకరమైన హెచ్చరికలు చేస్తుంటారు. అయినా జనాలు పెళ్ళి చేసుకోకుండా ఉండరు. ఫన్ ఫ్రస్ట్రేషన్ రెండూ చవిచూడక మానరు. నేహ ధూపియా.. ప్రియాంక.. దీపిక.. ఇలా ఈమధ్య చాలామంది హీరోయిన్లు వివాహం చేసుకున్నారు. తాజాగా ఈ లిస్టులోకి శ్వేత బసు ప్రసాద్ చేరుతోంది.

'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు ప్రేక్షకులలో ఎంతో గుర్తింపు సాధించిన శ్వేత బసు ప్రసాద్ తన కెరీర్లో పీక్స్ చూడలేకపోయినా ఒకటి ఆరా సినిమాలు చెస్తూ ఉన్న సమయంలో సెక్స్ స్కాండల్ లో ఆమె పేరు బయటకు రావడం ఆమె ఇమేజ్ ను దెబ్బ తీసింది. ఎలాగో అందులోనుండి బయటకు వచ్చి హిందీ సీరియల్స్ మీద ఫోకస్ చేసిన ఇప్పుడు సక్సెస్ఫుల్ సీరియల్ నటిగా కొనసాగుతోంది. 'చంద్రనందిని' సీరియల్ తో హిందీ ఆడియన్స్ ను మెప్పిస్తోంది. ఈ భామ ఫిలిం మేకర్ రోహిత్ మిట్టల్ తో నాలుగేళ్ళుగా ప్రేమలో ఉందట. ఈరోజే శ్వేత బసు - రోహిత్ మిట్టల్ జంట వివాహం చేసుకోబోతున్నారు.

దీంతో ఈ రోజు నుండి మిసెస్ మిట్టల్ గా మరి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది. ఈ జంట ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒక ఫోటోలో ఫుల్ గా గోరింటాకు పెట్టుకుని కాబోయే భర్తతో ఎంతో మురిపెంగా పోజిచ్చింది. ముచ్చటగా ఉన్న ఈ జంట వైవాహిక జీవితం ఓ కొత్త బంగారు లోకం కావాలని కోరుకుందాం.