Begin typing your search above and press return to search.

సమంతపై కామెంట్ చేసింది.. సమంతను రీప్లేస్ చేసింది

By:  Tupaki Desk   |   15 May 2019 9:59 AM GMT
సమంతపై కామెంట్ చేసింది.. సమంతను రీప్లేస్ చేసింది
X
‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రంలోనే తనదైన ముద్ర వేసింది శ్రద్ధ శ్రీనాథ్. తమిళంలో ఆమె తొలి సినిమా ‘విక్రమ్ వేద’ కూడా ప్రత్యేకమైన సినిమానే. ఇక సొంత భాష కన్నడలో ఆమె నటించిన ‘యు టర్న్’ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేయగా సమంత లీడ్ రోల్ చేసింది. ఐతే ‘జెర్సీ’ ప్రమోషన్ల సందర్భంగా తెలుగు ‘యు టర్న్’ చూశారా అని శ్రద్ధను అడిగితే.. అరగంట చూసి ఆపేశానని.. తన పాత్రలో మరొకరిని చూడలేకపోయానని.. ఒరిజినల్లో తానే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాననుకుంటున్నానని కామెంట్ చేసి సంచలనం రేపింది శ్రద్ధ. సమంత స్థాయి కథానాయిక గురించి ఇలా నెగెటివ్‌ గా మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఐతే శ్రద్ధ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన డోంట్ కేర్ యాటిట్యూడ్‌ తో సాగిపోయింది.

కట్ చేస్తే ఇప్పుడు శ్రద్ధ ఒక సినిమాలో సమంతనే రీప్లేస్ చేయబోతుండటం విశేషం. సమంతకు గత ఏడాది వేసవిలో మరపురాని మూడు విజయాలు దక్కాయి. అందులో ‘ఇరుంబు తిరై’ ఒకటి. విశాల్ హీరోగా పి.ఎస్.మిత్రన్ రూపొందించిన ఈ సైబర్ థ్రిల్లర్ తమిళ, తెలుగు భాషల్లో సూపర్ హిట్టయింది. సమంతకు కూడా మంచి పేరు తెచ్చింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ తీయబోతున్నారు. ఇందులో విశాల్ హీరోగా కొనసాగుతాడు కానీ.. కథానాయికను మాత్రం మార్చేస్తున్నారు. సమంత స్థానంలోకి శ్రద్ధ వస్తోంది. ఇప్పటికే అజిత్‌ తో కలిసి ‘పింక్’ రీమేక్ లాంటి క్రేజీ మూవీలో నటించే అవకాశం పట్టేసిన శ్రద్ధ.. ఇప్పుడు ‘ఇరుంబు తిరై’ రీమేక్ రూపంలో మరే మంచి ఛాన్స్ అందుకుంది. ప్రస్తుతం శివ కార్తికేయన్ కథానాయకుడిగా ఓ సినిమా రూపొందిస్తున్న మిత్రన్.. అది పూర్తయిన వెంటనే ‘ఇరుంబు తిరై-2’ను మొదలుపెడతాడు.