Begin typing your search above and press return to search.

ఎక్స్ ప్రెస్ రాజా కూడా ఇద్దరితోనంట!

By:  Tupaki Desk   |   27 July 2016 3:59 AM GMT
ఎక్స్ ప్రెస్ రాజా కూడా ఇద్దరితోనంట!
X
కథానాయకుల పక్కన ఇద్దరు భామలు వుండటం కంపల్సరీ అయిపోయింది. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల పక్కన ఇద్దరు హీరోయిన్లు నటిస్తూ వస్తున్నారు. ఇటీవల గోపీచంద్ కూడా తన తదుపరి చిత్రంలో తొలిసారిగా ఇద్దరు భామలతో రొమాన్స్ చేయబోతున్న విషయం తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హన్సిక - కేథరిన్ నటిస్తున్నారు. తాజాగా మరో యంగ్ హీరో కూడా తన తరువాతి చిత్రంలో ఇద్దరు భామలతో జతకట్టబోతున్నాడని టాలీవుడ్ వర్గాలంటున్నాయి. కంటెంట్ తో పాటు.. గ్లామర్ కూడా వుంటే.. ప్రేక్షకులకిచ్చే ఆ కిక్కేవేరు. అందుకే ఇద్దరు భామలకు ప్రాధాన్యం పెరిగిపోయింది. ఓ లీడ్ హీరోయిన్.. ఆమెకు సపోర్టివ్ గా మరో సెకెండ్ లీడ్ హీరోయిన్ వుండేలా చూసుకుంటున్నారు.

మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు - రన్ రాజా రన్ - ఎక్స్ ప్రెస్ రాజా లాంటి యూత్ ఫుల్ రొమాంటిక్ చిత్రాల హిట్ తో ఊపుమీద వున్న శర్వానంద్.. ఇప్పుడు రెండు చిత్రాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దిల్ రాజు - బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ లాంటి ప్రొడ్యూసర్లు శర్వానంద్ తో సినిమాలను చేస్తున్నారు. ఇందులో ఒకటి దిల్ రాజు నిర్మిస్తున్న ‘శతమానం భవతి’. ఇందులో ‘అ ఆ’ ఫేం అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించబోయే చిత్రంలో మాత్రం ఇద్దరు ముద్దుగుమ్మలు జోడీ కడుతున్నారు. అందులో ఒకరు హాటీ బ్యూటీ లావణ్య త్రిపాఠి కాగా.. మరో అమ్మడు అక్ష. ఇప్పటికే లావణ్య త్రిపాఠి అల్లు శిరీష్ సరసన ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంలో నటిస్తోంది. ఇది వచ్చేనెల 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇప్పుడు శర్వానంద్ తో జతకట్టబోతోంది. వరుస హిట్లమీద దూసుకుపోతున్న శర్వానంద్.. ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నాడు. శర్వానంద్ సినిమాల్లో ఫన్ తో పాటు రొమాంటిక్ సన్నివేశాలకు కొదువేం వుండదు. ఇప్పుడు లావణ్య - అక్ష లాంటి హాటీ బ్యూటీలతో ఆడిపాడనుండటం వల్ల సినిమా మరింత కలర్ ఫుల్ గా వుండే అవకాశం వుంటుందనడంలో సందేహం లేదు.