Begin typing your search above and press return to search.
అభిమానులకు వార్నింగ్ ఇచ్చిన కింగ్ ఖాన్
By: Tupaki Desk | 5 Oct 2015 7:30 PM GMTహీరోలేమో భాయి భాయి అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ కొట్టుకు చస్తూ ఉంటారు. టాలీవుడ్ - కోలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లో సైతం ఇదే పరిస్థితి. షారుఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్ ల మధ్య వైరం ఉన్నమాట వాస్తవమే కానీ.. ఈ మధ్య ఇద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. సల్మాన్ కొత్త సినిమా ‘భజరంగి భాయిజాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ని స్వయంగా షారుఖే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
షారుఖ్ - అమీర్ ల మధ్య కూడా శత్రుత్వమేమీ లేదు. కానీ ఫ్యాన్స్ మధ్య గొడవలు మాత్రం ఆగవు. ఈ మధ్య షారుఖ్ ఫ్యాన్స్ అయితే మరీ శ్రుతి మించిపోతున్నారు. సల్మాన్ - అమీర్ సినిమాలపై సోషల్ మీడియాలో అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ సంగతి షారుఖ్ దృష్టికి కూడా వచ్చింది. దీనిపై కింగ్ ఖాన్ కొంచెం సీరియస్ గానే రియాక్టయ్యాడు.
తన అభిమానులుగా చెప్పుకునే ఎవరైనా వేరే హీరోల్ని ఉద్దేశించి తిడుతూనో, వ్యతిరేకంగానో పోస్టులు పెడితే తనకు కోపం వస్తుందని అన్నాడు షారుఖ్. తన మిత్రులు, తన నిర్మాణ సంస్థలో పని చేసే వాళ్లు, తన అభిమానులుగా చెప్పుకునే వాళ్లు వేరే హీరోల్ని తిడితే.. వాళ్ల సినిమాల్ని విమర్శిస్తే వాళ్లు తన అభిమానులే కాదని అన్నాడు షారుఖ్. సోషల్ మీడియా మన అభిప్రాయాల్ని వ్యక్తం చేసేందుకు పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చిందని.. దాన్ని దుర్వినియోగం చేయొద్దని షారుఖ్ హితవు పలికాడు. సమాజంలో ఎలా ప్రవర్తించాలో తాను నేర్పడం లేదని.. ఐతే కొందరు ఇడియట్లతో మాత్రం తాను కఠినంగానే ఉంటానని షారుఖ్ ట్వీట్ చేశాడు.
షారుఖ్ - అమీర్ ల మధ్య కూడా శత్రుత్వమేమీ లేదు. కానీ ఫ్యాన్స్ మధ్య గొడవలు మాత్రం ఆగవు. ఈ మధ్య షారుఖ్ ఫ్యాన్స్ అయితే మరీ శ్రుతి మించిపోతున్నారు. సల్మాన్ - అమీర్ సినిమాలపై సోషల్ మీడియాలో అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ సంగతి షారుఖ్ దృష్టికి కూడా వచ్చింది. దీనిపై కింగ్ ఖాన్ కొంచెం సీరియస్ గానే రియాక్టయ్యాడు.
తన అభిమానులుగా చెప్పుకునే ఎవరైనా వేరే హీరోల్ని ఉద్దేశించి తిడుతూనో, వ్యతిరేకంగానో పోస్టులు పెడితే తనకు కోపం వస్తుందని అన్నాడు షారుఖ్. తన మిత్రులు, తన నిర్మాణ సంస్థలో పని చేసే వాళ్లు, తన అభిమానులుగా చెప్పుకునే వాళ్లు వేరే హీరోల్ని తిడితే.. వాళ్ల సినిమాల్ని విమర్శిస్తే వాళ్లు తన అభిమానులే కాదని అన్నాడు షారుఖ్. సోషల్ మీడియా మన అభిప్రాయాల్ని వ్యక్తం చేసేందుకు పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చిందని.. దాన్ని దుర్వినియోగం చేయొద్దని షారుఖ్ హితవు పలికాడు. సమాజంలో ఎలా ప్రవర్తించాలో తాను నేర్పడం లేదని.. ఐతే కొందరు ఇడియట్లతో మాత్రం తాను కఠినంగానే ఉంటానని షారుఖ్ ట్వీట్ చేశాడు.