Begin typing your search above and press return to search.
శేష్ కి సాయం చేస్తున్న లేడీ లక్ ఎవరు?
By: Tupaki Desk | 18 July 2019 12:14 PM GMTసెంటిమెంట్ లేని పరిశ్రమ లేదు. ముఖ్యంగా టాలీవుడ్ లో సెంటిమెంట్ కి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తమ సినిమాల రిలీజ్ ముందు తిరుమల తిరుపతి వెంకన్నకు మొక్కు చెల్లించేది ఒకరు అయితే సిద్ధి వినాయకుడి గుడికి వెళ్లి మొక్కుబడి చెల్లించేవారు ఇంకొకరు. ఇంట్లోంచి అడుగు పెట్టేప్పుడే వర్జ్యం పూజ్యం అంటూ లెక్కలు చూసుకుని బయట అడుగు పెట్టే స్టార్ హీరోలు ఉన్నారు. ఫలానా హీరో ప్రీరిలీజ్ కి వస్తే మా సినిమా హిట్టేనంటూ కొందరు హీరోలు వేదికలపై చెబుతుంటారు. ఇదంతా చూశాక.. ఎవరి పిచ్చి వారికి ఆనందం! అని కొందరికి అనిపించవచ్చు. కానీ ఈ సెంటిమెంట్ ని అనుసరించేందుకే అందరూ ఇష్టపడతారు.
యువహీరోల్లోనూ ఈ తరహా సెంటిమెంట్ తక్కువేమీ కాదని అడివి శేష్ ని చూస్తే అర్థమవుతోంది. అతడు నటించిన `ఎవరు` స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సాహో వాయిదా పడగానే ఆ తేదీని లాక్ చేసింది ఎవరు టీమ్. రిలీజ్ కి సరిగ్గా ఇంకో నెలరోజులు కూడా లేదు. అందుకే ప్రచారం పరంగా వేగం పెంచారు కథానాయకుడు శేష్. ఈ శుక్రవారం సాయంత్రం ఐదున్నరకు `ఎవరు?` టీజర్ ని స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నామని శేష్ ట్విట్టర్ లో ప్రకటించారు. ఆ మేరకు ఓ పోస్టర్ ని శేష్ రిలీజ్ చేశారు. `మిస్సింగ్ కేస్ ఫైల్!` అంటూ ఓ ఫైల్ ని పట్టుకుని కనిపిస్తున్నారు శేష్. దానిపై తమిళనాడు పోలీస్ డిపార్ట్ మెంట్ అని రాసి ఉంది. వర్మ అనే వ్యక్తి మిస్సింగ్ మిస్టరీకి సంబంధించిన ఈ ఫైల్ ని డీల్ చేస్తున్నది విక్రమ్ వాసుదేవన్ (శేష్) అనే పోలీస్ అధికారి కథ ఇదని ఫైల్ పై ఉన్న వివరాల్ని బట్టి అర్థమవుతోంది.
ఇక `ఎవరు` టీజర్ ని లాంచ్ చేస్తున్న సమంతను ఉద్ధేశించి శేష్ ఓ ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు. ``డియర్ సమంత రూత్ ప్రభు .. మీరు మహేష్ తో కలిసి క్షణం టీజర్ ఆవిష్కరించారు. అలాగే `గూఢచారి` టీజర్ ని పర్సనల్ గా వచ్చి లాంచ్ చేశారు. ఆ రెండు సినిమాలు గొప్పగా గర్వించదగ్గ సక్సెస్ ని ఇచ్చాయి. మీరు నిజంగానే లక్కీ లేడీ. రేపు (శుక్రవారం) ఎవరు టీజర్ ని లాంచ్ చేస్తున్నందుకు క్వీన్ బీకి థాంక్స్`` అని వ్యాఖ్యానించారు. సమంత ప్రచారం చేసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లు సాధించాయి కాబట్టి తనని లేడీ లక్! అంటూ శేష్ ఇలా మరోసారి ప్రచారానికి పిలుస్తున్నారన్నమాట. దీనిని అతడు సెంటిమెంట్ గా భావించి హ్యాట్రిక్ హిట్ పై కన్నేశారని అర్థమవుతోంది. పీవీపీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
యువహీరోల్లోనూ ఈ తరహా సెంటిమెంట్ తక్కువేమీ కాదని అడివి శేష్ ని చూస్తే అర్థమవుతోంది. అతడు నటించిన `ఎవరు` స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సాహో వాయిదా పడగానే ఆ తేదీని లాక్ చేసింది ఎవరు టీమ్. రిలీజ్ కి సరిగ్గా ఇంకో నెలరోజులు కూడా లేదు. అందుకే ప్రచారం పరంగా వేగం పెంచారు కథానాయకుడు శేష్. ఈ శుక్రవారం సాయంత్రం ఐదున్నరకు `ఎవరు?` టీజర్ ని స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నామని శేష్ ట్విట్టర్ లో ప్రకటించారు. ఆ మేరకు ఓ పోస్టర్ ని శేష్ రిలీజ్ చేశారు. `మిస్సింగ్ కేస్ ఫైల్!` అంటూ ఓ ఫైల్ ని పట్టుకుని కనిపిస్తున్నారు శేష్. దానిపై తమిళనాడు పోలీస్ డిపార్ట్ మెంట్ అని రాసి ఉంది. వర్మ అనే వ్యక్తి మిస్సింగ్ మిస్టరీకి సంబంధించిన ఈ ఫైల్ ని డీల్ చేస్తున్నది విక్రమ్ వాసుదేవన్ (శేష్) అనే పోలీస్ అధికారి కథ ఇదని ఫైల్ పై ఉన్న వివరాల్ని బట్టి అర్థమవుతోంది.
ఇక `ఎవరు` టీజర్ ని లాంచ్ చేస్తున్న సమంతను ఉద్ధేశించి శేష్ ఓ ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు. ``డియర్ సమంత రూత్ ప్రభు .. మీరు మహేష్ తో కలిసి క్షణం టీజర్ ఆవిష్కరించారు. అలాగే `గూఢచారి` టీజర్ ని పర్సనల్ గా వచ్చి లాంచ్ చేశారు. ఆ రెండు సినిమాలు గొప్పగా గర్వించదగ్గ సక్సెస్ ని ఇచ్చాయి. మీరు నిజంగానే లక్కీ లేడీ. రేపు (శుక్రవారం) ఎవరు టీజర్ ని లాంచ్ చేస్తున్నందుకు క్వీన్ బీకి థాంక్స్`` అని వ్యాఖ్యానించారు. సమంత ప్రచారం చేసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లు సాధించాయి కాబట్టి తనని లేడీ లక్! అంటూ శేష్ ఇలా మరోసారి ప్రచారానికి పిలుస్తున్నారన్నమాట. దీనిని అతడు సెంటిమెంట్ గా భావించి హ్యాట్రిక్ హిట్ పై కన్నేశారని అర్థమవుతోంది. పీవీపీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.