Begin typing your search above and press return to search.

సవ్యసాచి: మనసుని తాకే 'ఒక్కరంటే ఒక్కరు'

By:  Tupaki Desk   |   16 Oct 2018 6:33 PM GMT
సవ్యసాచి: మనసుని తాకే ఒక్కరంటే ఒక్కరు
X
అక్కినేని నాగ చైతన్య - చందూ మొండేటి కాంబినేషన్ లో 'సవ్యసాచి' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమానుండి మొదటి సింగిల్ 'వై నాట్' ను రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది. యూత్ ఫుల్ గా ఉన్న ట్యూన్ తో కీరవాణి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇక తాజాగా 'సవ్యసాచి' మేకర్స్ ఈ సినిమా నుండి 'ఒక్కరంటే ఒక్కరు' అంటూ సాగే సెకండ్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

"ఒక్కరంటే ఒక్కరు.. ఇద్దరంటే ఇద్దరు

ఒక్కరంటే ఒక్కరు.. ఇద్దరంటే ఇద్దరు

ఒక తనువున ఎదిగిన కవలలు

ఒక తీరుగా కదలని తలపులు

ఒకరికొకరుగా మీరు కలిసుంటే చాలు.. అమ్మకదే పదివేలు"

ఇలా సాగుతుంది పాట. 'వ్యానిషింగ్ సిండ్రోమ్' తో బాధపడే తన తన ముద్దుల కొడుకు కోసం ఓ అమ్మ ఆర్ద్రత తో పాడే పాట ఇది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటను తేలికైన పదాలతో ఎంతో అందంగా రాస్తే.. కీరవాణి మరింత సాఫ్ట్ మెలోడీ ట్యూన్ తో ఆ పాటను మరో లెవెల్ కు తీసుకెళ్ళాడు. ఈ పాటను అంతకంటే టచింగ్ వాయిస్ తో శ్రీనిధి పాడడం మరో విశేషం. ఈ పాట చైతు కెరీర్ లో ఒక మరపురాని మెలోడీగా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. నవంబర్ 2 న 'సవ్యసాచి ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతలోపు 'ఒక్కరంటే ఒక్కరు.. ఇద్దరంటే ఇద్దరు' పై మీరు లుక్కేయండి.