Begin typing your search above and press return to search.

విజ‌య‌వాడ‌లో స‌రైనోడి సంబ‌రాలు

By:  Tupaki Desk   |   2 May 2016 4:14 PM GMT
విజ‌య‌వాడ‌లో స‌రైనోడి సంబ‌రాలు
X
‘స‌రైనోడు’ టీమ్ ప్ర‌మోష‌న్ విష‌యంలో స్ట్రాట‌జిక్ గా అడుగులు వేస్తోంది. ఆడియో ఫంక్ష‌న్ చేయ‌కుండా.. వెరైటీగా విడుద‌ల‌కు ముందు విశాఖ‌ప‌ట్నంలో ప్రి రిలీజ్ వేడుక చేసిన స‌రైనోడు యూనిట్.. విడుద‌ల త‌ర్వాత హైద‌రాబాద్ లో ఓ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. ఇప్పుడేమో విజ‌య‌వాడ వేదిక‌గా స‌రైనోడు స‌క్సెస్ సంబ‌రాల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఈ నెల నాలుగో తేదీన (బుధ‌వారం) విజ‌య‌వాడ‌లో సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్స్ లో స‌రైనోడు విజ‌యోత్స‌వ సంబ‌రాల్ని భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్న‌ట్లు నిర్మాత అల్లు అర‌వింద్ ప్ర‌క‌టించాడు.ఈ వేడుకకు హీరో అల్లు అర్జున్. ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను.. హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్.., కేథ‌రిన్ థ్రెసాల‌తో పాటు చిత్ర యూనిట్ అంతా హాజరు కానుంది. సొమ‌వారం మంత్రి గంటా శ్రీనివాస‌రావుతో క‌లిసి ప్రెస్ మీట్ పెట్టి ఈ స‌క్సెస్ మీట్ గురించి వెల్ల‌డించారు అర‌వింద్.

ఈ సంద‌ర్భంగా అర‌వింద్ మాట్లాడుతూ.. ‘‘అల్లు అర్జున్ కెరీర్లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధిస్తున్న చిత్రంగా సరైనోడు నిలిచింది. మాస్ - క్లాస్ అనే తేడా లేకుండా రిపీట్ ఆడియెన్స్ తో హౌస్ ఫుల్ కలెక్ష‌న్లు సాధిస్తోంది సరైనోడు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులు.. మెగాభిమానుల సమక్షంలో విజయోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించాం. ఈనెల 4వ తేదీన విజయవాడలోని సిద్ధార్థ హోట‌ల్ మెనేజ్‌మెంట్ కాలేజి గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ చేయనున్నాం. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ అంతా హాజరవుతుంది’’ అన్నారు.