Begin typing your search above and press return to search.

రాధికను అవమానించారంటున్న శరత్ కుమార్!

By:  Tupaki Desk   |   26 Aug 2016 2:15 PM GMT
రాధికను అవమానించారంటున్న శరత్ కుమార్!
X
తమిళ - తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి, తర్వాత రెండు బాషల్లోనూ సీరియల్స్ లో కూడా నటిస్తూ.. తిరిగి సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పిస్తున్న సీనియర్ నటి రాదిక అంటే అందరూ అభిమానించడంతోపాటు.. ఎంతో గౌరవిస్తారు కూడా! అయితే ఆమె తాజాగా నటించిన విజయ సేతుపతి చిత్రం ధర్మ దురైలో ఆమెను ఇన్సల్ట్ చేశారంటూ ఆరోపించారు ఆమె భర్త శరత్ కుమార్. అయితే ఈ విషయంలో పొరపాటు జరిగిందని తర్వాత ఆ సినిమా నిర్మాత - దర్శకుడు క్షమాపణలు కూడా చెప్పారు.

విషయానికొస్తే... ధర్మ దురై సినిమాని తన భార్య రాధికతో కలిసి చూసిన శరత్ కుమార్ ఈమేరకు కొన్ని కామెంట్స్ చేశారు. అనంతరం ఎంతో బాదపడి ఒక ట్వీట్ చేశారు. ఇంతకూ శరత్ కుమార్ బాదపడింది ఆ సినిమాలో రాధిక పాత్ర గురించి కాదు... టైటిల్ కార్డ్స్ లో రాధిక పేరు ఎక్కడో కొత్త ఆర్టిస్ట్ లు పేర్లు వేసాక వేయటం పైన . ఈ విషయమే తనను ఎంతో బాదించిందని ఆయన్ని ట్వీట్ చేశారు. అంతటి సీనియర్ నటిని ఎలా గౌరవించాలో ఇండస్ట్రీకి తెలియదా అని ప్రశించారు. ఇది కచ్చితంగా ఒక సీనియర్ నటి అయిన రాధికకు జరిగిన అవమానమే అంటున్నారు ఆయన.

అయితే ఈ విషయంపై చిత్ర నిర్మాత సురేష్ మాట్లాడుతూ.. ఇది కావాలని చేసిన తప్పుకాదని - కేవలం సాంకేతిక కారణాల వల్లే అలా జరిగిందని, రాధికా మేడం అంటే ఎంతో గౌరవం అని అంటూ... పొరపాటున జరిగిన ఈ విషయమై ఆమెకు క్షమాపణ చెప్తున్నాను అని అన్నారు. అనంతరం చిత్ర దర్శకుడు సీను రామసామి కూడా స్పందించి.. రాధికకు తాను వీరాభిమానిని అని, ఇంకా గట్టిగా మాట్లాడితే ఏకంగా ఆరాధకుడినని చెప్పుకొచ్చారు. ఇది పొరపాటున జరిగిన పొరపాటే తప్ప మరొకటి కాదని అన్నారు. ఈ విషయంలో రాధిక గారు తమను అర్ధం చేసుకుంటారని నమ్ముతున్నాని తెలిపారు. కాగా విజయసేతుపతి - తమన్నా కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రంలో రాధిక కీ రోల్ చేశారు.