Begin typing your search above and press return to search.

సైలెంట్‌ గా కానిచ్చేస్తున్న సమంత

By:  Tupaki Desk   |   7 Dec 2018 1:30 AM GMT
సైలెంట్‌ గా కానిచ్చేస్తున్న సమంత
X
స్టార్‌ హీరోయిన్‌ సమంత ఒక వైపు తన భర్త నాగచైతన్య తో కలిసి ‘మజిలి’ అనే చిత్రం లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం షూటింగ్‌ లో పాల్గొంటూనే గ్యాప్‌ ఉన్నప్పుడల్లా నందిని రెడ్డి దర్శకత్వం లో కొరియన్‌ మూవీ ‘మిస్‌ గ్రానీ’ రీమేక్‌ షూట్‌ లో పాల్గొంటుంది. కొన్ని రోజులు గా మిస్‌ గ్రానీ సినిమా రీమేక్‌ కు సంబంధించిన వార్తలు వచ్చాయి. కాని అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. దాంతో ఉందా లేదా అంటూ కొందరు అనుమానాల్లో ఉన్నారు. ఈ సమయంలోనే చడీ చప్పుడు కాకుండా సినిమా చిత్రీకరణను నందిని రెడ్డి మొదలు పెట్టేసింది.

ఇప్పటి కే సినిమా కు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసినట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ లోని రవీంద్ర భారతి లో సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు. సమంత తో పాటు నాగశౌర్య ఇంకా ఇతర నటీనటులు ఈ షూటింగ్‌ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం లో ప్రొఫైల్‌ లో తెరకెక్కించి విడుదల చేయాలని నందిని రెడ్డి మరియు సమంతలు భావిస్తున్నారట. అందుకే షూటింగ్‌ ప్రారంభోత్సవ హడావుడి ఏమీ లేకుండా, కామ్‌ గా పని కానిచ్చేస్తున్నారు.

ఈ చిత్రం లో సమంత చాలా విభిన్నమైన పాత్రలో కనిపిస్తుందట. ముసలి బామ్మ పాత్ర లో మరియు పడుచు అమ్మాయి గా సమంత నటించబోతుంది. తాంత్రిక శక్తుల నేపథ్యం లో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. కొరియన్‌ మిస్‌ గ్రానీ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో ఆ కథాంశంతోనే ఇప్పుడు తెలుగు తమిళం లో నందిని రెడ్డి రీమేక్‌ చేస్తోంది. సురేష్‌ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌ లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నటి గా సమంత కు ఈ చిత్రం ఒక ఛాలెంజ్‌ గా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి ఆ ఛాలెంజ్‌ లో నందిని రెడ్డి ఏ స్థాయిలో సక్సెస్‌ అవుతుందో చూడాలి.