Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: భాయిజాన్ బోర్డర్ మే ఖడా హై!

By:  Tupaki Desk   |   15 Nov 2018 10:48 AM GMT
ఫోటో స్టొరీ: భాయిజాన్ బోర్డర్ మే ఖడా హై!
X
బాలీవుడ్లో ఎంతో మంది స్టార్స్ ఉంటారు గానీ సల్మాన్ మాత్రం వన్ అండ్ ఓన్లీ. ఎందుకంటే కంటెంట్ ఉండి.. యాక్టింగ్ ఇరగదీసి హిట్ కొట్టడం కామన్. కానీ యావరేజ్ కంటెంట్ తో తనకు మాత్రమే సాధ్యమైన సల్లు భాయ్ స్టైల్ లో యాక్టింగ్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లు నమోదు చెయ్యడం మాత్రం సల్మాన్ ఖాన్ భాయిసాబుకు మాత్రమే సొంతం.

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం అలీ అబ్బాస్ జఫార్ దర్శకత్వంలో 'భారత్' అనే సినిమాలో నటిస్తున్నాడు. అలీ అబ్బాస్ జఫార్ సల్మాన్ తో 'సుల్తాన్'.. 'టైగర్ జిందా హై' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి ఒక స్టిల్ ను సల్మాన్ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు.

సల్మాన్ షేర్ చేసిన స్టిల్ లో సల్మాన్ - కత్రినా ఇద్దరూ వాఘాలోని ఇండియా - పాకిస్తాన్ బోర్డర్ గేట్ దగ్గర నిలబడి ఉన్నారు. ఇండియా వైపునుండి మూసిన గేటును చూస్తూ నిలుచున్నారు. సల్మాన్ సూటు బూటులో రెండు చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకుని ఉండగా కత్రినా కైఫ్ చీరకట్టుకుని పైన ఒక షాల్ వేసుకుని నిలబడింది. ఫోటోలో ఇద్దరూ వెనకవైపు నుండి కనిపిస్తున్నారు. ఇద్దరూ ఏం ఆలోచిస్తున్నారో.. బోర్డర్ దగ్గర ఎందుకు నిలబడ్డారో ఇప్పుడప్పుడే మనకు తెలిసే అవకాశం లేదు.

సౌత్ కొరియన్ సినిమా 'ఓడ్ టు మై ఫాదర్' అనే సినిమా ఆధారంగా ఈ 'భారత్' తెరకెక్కుతోంది. ఈ సినిమాలో టబు.. వరుణ్ ధావన్.. దిశా పతాని లు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సల్మాన్ లక్కీ సీజన్ ఈద్ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అంటే రఫ్ గా 2019..జూన్ 5 న.