Begin typing your search above and press return to search.

భయపెట్టే సినిమాలో హైబ్రిడ్ పిల్ల

By:  Tupaki Desk   |   20 March 2018 6:32 AM GMT
భయపెట్టే సినిమాలో హైబ్రిడ్ పిల్ల
X
ఫిదా సినిమాలో భానుమతి పాత్ర ద్వారా ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హైబ్రిడ్ పోరీ సాయి పల్లవి ఒకే తరహా సినిమాలకు కట్టుబడనని తన కథల ఎంపికలోనే చూపిస్తోంది. ప్రస్తుతం తను నటించిన కణం విడుదలకు సిద్ధంగా ఉండగా అందులో ఒక మృత శిశువుకు తల్లిగా నటించిందనే వార్త ప్రేక్షకుల్లో కొత్త ఆసక్తి రేపుతోంది. తమిళ్ స్టార్ హీరోస్ సూర్య - ధనుష్ లతో చెరో సినిమా చేస్తున్న సాయి పల్లవి తెలుగులో శర్వానంద్ తో పడి లేచే మనసుకోసం జట్టు కట్టింది. వీటి తర్వాత చాలా భిన్నమైన అడల్ట్ రేటెడ్ సినిమాలు తీస్తాడని పేరున్న మిస్కిన్ తో త్వరలో ఒక రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ లో సాయి పల్లవి నటించబోతోంది అనే వార్త ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా మిస్కిన్ సినిమాలన్నీ ఎ సర్టిఫికేట్ మాత్రమే తెచ్చుకుంటాయి. ఎప్పుడు ఫ్యామిలీని హోల్ సేల్ గా మెప్పించిన సినిమాలు ఆయన చేయలేదు. అందుకే ఈయనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడు మిస్కిన్ తీయబోయే సినిమాలో సాయి పల్లవి అంటే అది ఖచ్చితంగా చాలా స్పెషల్ గా ఉంటుంది అనే అంచనాలు తప్పకుండా ఉంటాయి. పైగా దీనికి మేస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేయనుండటం మరో ఆకర్షణగా నిలవనుంది. సీనియర్ నటులు దర్శకులు భాగ్యరాజ్ తనయుడు శంతను హీరోగా నటించే ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాని సాయి పల్లవి వైపు నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ వెళ్లలేదని టాక్. మరోవైపు నిత్యమీనన్ తో కూడా యూనిట్ చర్చల్లో ఉంది. ఇద్దరు కలిసి నటిస్తారా లేక సాయి పల్లవి వద్దంటే నిత్యను తీసుకుంటారా అనే క్లారిటీ అయితే రావలసి ఉంది.