Begin typing your search above and press return to search.

మల్టీ స్టారర్ కి నో అన్న భానుమతి

By:  Tupaki Desk   |   21 Oct 2018 9:56 AM GMT
మల్టీ స్టారర్ కి నో అన్న భానుమతి
X
గత ఏడాది ఫిదా బ్లాక్ బస్టర్ సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ సాయి పల్లవికి ఆ తర్వాత అవకాశాలు వెల్లువలా చుట్టుముట్టాయి కానీ తాను మాత్రం తొందరపడకుండా ఆచి తూచి కథలను ఎంచుకుంటోంది. నాని ఎంసిఎ తర్వాత శర్వానంద్ తో పడి పడి లేచే మనసు మాత్రమే ఒప్పుకున్నసాయి పల్లవి తమిళ్ లో ధనుష్ తో మారి 2 తో పాటు సూర్య సరసన మరో మూవీ చేస్తోంది. ఇవి కాకుండా టాలీవుడ్ లో తనకు ఇంకే కమిట్ మెంట్స్ ప్రస్తుతానికి లేవు.

విశ్వసనీయ సమాచారం మేరకు తాను ఎప్పుడో స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్న మల్టీ స్టారర్ దాగుడుమూతలు కోసం దర్శకుడు హరీష్ శంకర్ సాయి పల్లవిని కలిశాడట. కథ నచ్చినా అందులో తన పాత్ర తీరు తెన్నులు అంతగా సంతృప్తికరంగా అనిపించకపోవడంతో మొహమాటం లేకుండా నో చెప్పినట్టు టాక్. ఇదే కథ దిల్ రాజు తీయాలని డిసైడ్ అయ్యాక తర్వాత ఎందుకో మనసు మార్చుకున్నారు. ఆ మధ్య లవర్ ప్రీ రిలీజ్ మీట్ లో ఆయనే ఈ విషయాన్నీ చెప్పారు.

సో హరీష్ శంకర్ కి నో చెప్పిన సాయి పల్లవి తనకు కథ నచ్చితే తప్ప ఓ పట్టాన ఓకే చెప్పడం లేదట. అందుకే ఫిదా తర్వాత అన్ని అవకాశాలు చుట్టుముట్టినా టెంప్ట్ కాకుండా నచ్చినా పాత్రలకె సైన్ చేస్తోంది. దాగుడుమూతలులో హీరోలు ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు. రామ్-నితిన్-శర్వానంద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి అంటున్నారు కానీ ఫైనల్ గా ఎవరు పచ్చ జెండా ఊపుతారో తెలియదు. హీరోయిన్లు గా రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు నివేదా థామస్ ను సెట్ చేసుకునే పనిలో ఉన్నాడట హరీష్ శంకర్. ఇంకా ఎవరి నుంచి మాట తీసుకోలేదని వినికిడి. మరి దాగుడుమూతలు వదులుకున్న సాయి పల్లవి పడి పడి లేచే మనసు తరువాత ఏ కథ మీద మనసు పారేసుకుంటుందో చూడాలి.