Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క్రేజేంటో మూడు ఫొటోల‌తో చెప్పాడు

By:  Tupaki Desk   |   24 March 2017 12:53 PM GMT
ప‌వ‌న్ క్రేజేంటో మూడు ఫొటోల‌తో చెప్పాడు
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఇండ‌స్ట్రీలోనూ వీరాభిమానులు చాలామందే ఉన్నారు. అందులో అత‌డి మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా ఒక‌డు. మావ‌య్య పేరు చెబితే ఊగిపోతాడ‌త‌ను. ఎన్నోసార్లు ప‌వ‌న్ విష‌యంలో ఒక సగ‌టు అభిమానిలాగా స్పందించాడు సాయిధ‌ర‌మ్. ప‌వ‌న్ కొత్త సినిమా ‘కాట‌మ‌రాయుడు‘ రిలీజ్ సంద‌ర్భంగానూ సాయిధ‌ర‌మ్ త‌న అభిమానాన్ని మ‌రోసారి ప్ర‌ద‌ర్శించాడు.

‘కాట‌మ‌రాయుడు‘ రిలీజ్ సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు క‌ర్ణాట‌క‌.. త‌మిళ‌నాడు.. అమెరికాల్లో ఎంత హంగామా న‌డుస్తోందో తెలిసిందే. థియేట‌ర్ల‌లో అభిమానుల సంద‌డి మామూలుగా లేదు. అలా ఒక థియేట‌ర్లో నెల‌కొన్న సంద‌డికి సంబంధించి మూడు ఫొటోలు షేర్ చేశాడు తేజు. అందులో మొద‌టి దాంట్లో ప‌వ‌న్ ఇంట్రో దృశ్యం క‌నిపిస్తోంది. రెండో దాంట్లో ప‌వ‌న్ మీద కురుస్తున్న కాగితాల వ‌ర్షం క‌నిపిస్తోంది. ఆపై నేల మీద ఆ కాగితాల కుప్ప ద‌ర్శ‌న‌మిస్తోంది.

ఇలా ప‌వ‌న్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు తేజు. ఈ మూడు ఫొటోల‌కు క్యాప్ష‌న్లు కూడా పెట్టాడు తేజు. ఇది ప‌డింది.. ఇదీ రియాక్ష‌న్.. ఇదీ రిజ‌ల్ట్ అంటూ పెట్టిన క్యాప్ష‌న్లు ప‌వ‌న్ అభిమానుల్ని అల‌రించేవే.ఈ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కంటెంట్ వీక్ అయిన‌ప్ప‌టికీ.. అభిమానుల్ని అల‌రించేలా ఉండ‌టంతో ‘కాట‌మ‌రాయుడు‘ సేఫ్ వెంచ‌ర్ అవుతుంద‌ని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/