Begin typing your search above and press return to search.

కరిగించే పనిలో సుప్రీమ్ హీరో!

By:  Tupaki Desk   |   15 July 2018 5:45 AM GMT
కరిగించే పనిలో సుప్రీమ్ హీరో!
X
వరుస దెబ్బలతో మార్కెట్ లో తన ఇమేజ్ బాగా డల్ అయిపోవడంతో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొంత నిరాశలో ఉన్నాడు. స్టార్ హీరో అయినా ఒక్క డిజాస్టర్ వస్తేనే చాలా ఇబ్బంది పడతాడు. అలాంటిది అప్ కమింగ్ స్టేజిలో అది కూడా ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న సమయంలో ఇలా ఆరు పరాజయాలు ఫేస్ చేయటం అంటే మాటలు కాదు. అందుకే ఇకపై కథల ఎంపికలో ఇంకా జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయ్యాడు తేజు. అది పక్కన పెడితే తేజు మీదున్న మరో కంప్లైంట్ ఫిజికల్ ఫిట్ నెస్. సినిమా సినిమాకు బొద్దుగా తయారవుతున్నాడు. తేజ్ ఐ లవ్ యులో స్టెప్స్ వేసేటప్పుడు కాస్త ఇబ్బంది పడటం స్పష్టంగా కనిపించింది. మునుపటితో పోల్చుకుంటే సాయి ధరమ్ తేజ్ కాస్త లావయ్యాడు అనేది నిజం. జవాన్ కు ఈ సినిమాకే ఇంత మార్పు వచ్చింది అంటే వర్క్ అవుట్స్ లో ఎక్కడో తేడా కొట్టేసినట్టేగా. దానికి తోడు ఫీడ్ బ్యాక్ కూడా ఈ విషయంలో నెగటివ్ గా రావడంతో అలెర్ట్ అయిన తేజు అమెరికా వెళ్ళిపోయాడు.

విశ్వసనీయ సమాచారం మేరకు కొంత కాలం అక్కడే ఉండి మేకోవర్ చేసుకుని వెనక్కు వస్తాడట. ఇందులో కోసం భారీగా ఫీజు చెల్లించుకుని మరీ ఓ ప్రసిద్ధ ట్రైనర్ ను మాట్లాడుకున్నట్టు టాక్. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తిగా నిలిచాడు కాబోలు. జై లవకుశ తర్వాత ఇదే టాస్క్ మీద నాలుగు నెలలు ఖర్చు పెట్టిన తారక్ తన కొత్త లుక్ చూపించి అందరిని షాక్ కి గురి చేసాడు. ఇప్పుడు తేజు టార్గెట్ కూడా అదే. కిషోర్ తిరుమలతో పాటు గోపిచంద్ మలినేని కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తేజు వీటిలో ఏది ముందు మొదలు పెడతాడు అనేది బయటికి చెప్పనప్పటికీ మైత్రి సంస్థ తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందే సినిమానే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదైతేనేం మొత్తానికి తేజు మంచి నిర్ణయమే తీసుకున్నాడు అంటున్నారు ఫాన్స్.