Begin typing your search above and press return to search.

‘జనతా గ్యారేజ్’లోకి మరో ఫేమస్ యాక్టర్

By:  Tupaki Desk   |   25 May 2016 10:15 AM GMT
‘జనతా గ్యారేజ్’లోకి మరో ఫేమస్ యాక్టర్
X
ఇప్పటికే కావాల్సినంత భారీ తారాగణం ఉంది ‘జనతా గ్యారేజ్’లో. ఐతే కొరటాల శివ అంతటితో సంతృప్తి చెందకుండా మరో ప్రముఖ నటుడిని ఈ ప్రాజెక్టులోకి తీసుకొస్తున్నాడు. ప్రముఖ మరాఠీ నటుడు సచిన్ ఖేద్కర్ కూడా ‘జనతా గ్యారేజ్’లో ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. ‘బోస్.. ది ఫర్గెటన్ హీరో’ సినిమాతో దేశవ్యాప్తగా పేరు సంపాదించిన సచిన్ ఖేద్కర్.. విక్రమ్ కుమార్ ‘13 బి’.. సూర్య ‘బ్రదర్స్’ లాంటి సినిమాలతో సౌత్ ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. ‘జనతా గ్యారేజ్’లో తన కోసం ఆఫర్ చేసిన పాత్ర బాగా నచ్చడంతో అతను మరో మాట లేకుండా ఇందులో నటించడానికి ఒప్పుకున్నాడట.

ఎన్టీఆర్-సమంత-నిత్యామీనన్ లీడ్ రోల్స్ చేస్తున్న ‘జనతా గ్యారేజ్’లో మోహన్ లాల్.. ముకుందన్.. రఘుమాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతం దాకా పూర్తయింది. ఇంకో నెల రోజుల్లో టాకీ పార్ట్ అంతా పూర్తయ్యే అవకాశముంది. మధ్యలో కొన్ని రోజులు విరామం తీసుకున్న ‘జనతా గ్యారేజ్’ టీమ్ రెండు రోజుల కిందటే కొత్త షెడ్యూల్ మొదలుపెట్టింది. సచిన్ ఖేద్కర్ ఈ షెడ్యూల్లోనే యూనిట్ తో కలవబోతున్నాడు. ‘నాన్నకు ప్రేమతో’ లాంటి హిట్ తర్వాత ఎన్టీఆర్.. ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘జనతా గ్యారేజ్’ మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్టు 12 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.