Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ వాడ్ని లోపలకు తేవొద్దు అన్నాడు

By:  Tupaki Desk   |   27 March 2017 4:18 PM GMT
ఎన్టీఆర్ వాడ్ని లోపలకు తేవొద్దు అన్నాడు
X
''మట్టిలోకి వెళ్ళి బురద అంటుకోకూడదు అనుకుంటే ఎలా. నాకు బండ్ల గణేష్‌ అలా. వాడు ఒక రాహు కేతువు లాంటోడు. వాడిపై 14 కేసులు పెట్టాను. కోర్టు వాడి సంగతి చూసుకుంటుంది. బండ్ల గణేష్‌ ముఖం మీద అంతా మంచే చెబుతాడు.. కాని మనం వెళ్ళాక మన గురించి చెత్త చెబుతాడు. ఇలా అందరి నటుల గురించీ చెప్పాడు'' అంటూ ఘాటుగా గణేష్‌ గురించి కామెంట్ చేశాడు సచిన్ జోషి.

బండ్ల గణేష్‌ పదేపదే వెనుకపడటంతో.. చరణ్‌ మరియు ఎన్టీఆర్ తో సినిమాలు చేస్తున్నా అని చెప్పడంతో.. తన కంపెనీ (వైకింగ్ ఎంటర్టయిన్మెంట్) గణేష్‌ కు అప్పు ఇచ్చిందని చెప్పాడు. ''అసలు మనోడు ఏదీ నిజం చెప్పడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ తో సినిమాలు చేస్తున్నా అంటున్నాడు. పవన్ అంటే ఒక శక్తి. ఇండియాలోనే గొప్ప నటుడు. అతని పేరు కూడా వీడు నాశనం చేస్తున్నాడు. అసలు ఒకసారి మనోడితో జూ.ఎన్టీఆర్ ఇంటికి వెళితే.. వాడ్ని ఎందుకు తీసుకొచ్చావ్.. వాడ్ని లోపలకు తేవొద్దు.. అన్నాడు ఎన్టీఆర్. వీడికి ఉన్న గౌరవం అది'' అని చెప్పాడు సచిన్. పైగా గణేష్‌ రాసిన ప్రామిసరీ నోట్లన్నీ కూడా మీడియాకు చూపిస్తూ.. వీటి కాపీస్ ఇవ్వలేం.. ఎందుకంటే కోర్టులో ఉంది కేసు అంటూ సచిన్ టీమ్ తెలియజేశారు.

ఇకపోతే ఒకసారి గణేష్‌ విషయంలో సెటిల్మంట్ జరిగిందని.. ఆ సమయంలోనే మనోడు అరెస్టయ్యేవాడని.. కాని వాళ్ళ నాన్న గారు కన్నీరు పెట్టుకోవడం వలన సేవ్ అయ్యాడని చెప్పాడు సచిన్. ''అసలు గణేష్‌ లాంటి కొడుకు కోసం ఆయన తండ్రి కన్నీరు పెట్టుకోవడం చాలా బాధాకరమైన విషయం. అప్పుడే అరెస్టయ్యేవాడు. అందుకే అప్పుడు 14 కోర్టు కేసులు పెట్టాం. ఇప్పుడు మనోడి సంగతి కోర్టు చూసుకుంటుంది'' అంటూ చెప్పాడు సచిన్ జోషి. దీనిపై మరోసారి గణేష్‌ ఏమన్నా స్పందిస్తాడేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/