Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏం చెడింది?

By:  Tupaki Desk   |   25 Nov 2015 7:30 AM GMT
ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏం చెడింది?
X
నిర్మాత‌ల‌తో ద‌ర్శ‌కుల సాన్నిహిత్యాన్ని బ‌ట్టే ఫైన‌ల్ ప్రొడ‌క్ట్‌ - రిజ‌ల్ట్ ఉంటాయ‌న్న‌ది అక్ష‌ర స‌త్యం. ఈ ఇద్ద‌రికీ మ‌ధ్య‌ ఏం చెడినా ఆ సినిమా అధోగ‌తి పాలైపోయిన‌ట్టే. అందుకే మూవీ అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ ఉన్న‌ప్పుడు నిర్మాత ఎంతో జాగ్ర‌త్త‌గా ఉంటాడు. అలా ఎంతో జాగ్ర‌త్త ప‌రుడైన నిర్మాత‌గా హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ అధినేత ఎస్‌.రాధాకృష్ణ పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` వంటి క్లాసిక్ హిట్ మూవీని నిర్మించారు. బ‌న్ని హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 50 కోట్లు వ‌సూలు చేసింది. త్రివిక్ర‌మ్ - రాధాకృష్ణ మ‌ధ్య ఉన్న సింకు వ‌ల్లే మూవీ బాగా వ‌చ్చింది. అంత పెద్ద హిట్ట‌య్యింద‌న్న ప్ర‌చారం సాగింది.

త‌మ మ‌ధ్య సాన్నిహిత్యాన్ని నిజం చేస్తూ ఆ వెంట‌నే త్రివిక్ర‌మ్‌ తోనే ఎస్‌.రాధాకృష్ణ `అ.. ఆ` మూవీకి ప్లాన్ చేశారు. నితిన్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ఆన్‌ సెట్స్ ఉంది. ఈ చిత్రం అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ ఉండ‌గానే త్రివిక్ర‌మ్‌ తోనే మ‌రో సినిమాకి ప్లాన్ చేశారు రాధాకృష్ణ‌. ఈసారి హ్యాట్రిక్ సినిమా మ‌హేష్‌ తో కావాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌. ఇప్ప‌టికే మ‌హేష్‌ కి 10 కోట్ల అడ్వాన్సు కూడా ఇచ్చారు. అయితే నిన్న‌టిరోజున మ‌హేష్ ఆ అడ్వాన్సును వెన‌క్కి పంపాడ‌న్న వార్త రాగానే సినీలోకం విస్తుపోయింది. ఎందుకిలా జ‌రిగింది? కార‌ణ‌మేంటి? అని ఆరాతీసిన వారికి కొన్ని షాకింగ్ నిజాలు తెలిశాయ‌ని చెబుతున్నారు.

ఇటీవ‌లి కాలంలో త్రివిక్ర‌మ్ - రాధాకృష్ణ మ‌ధ్య అభిప్రాయ భేధాలు వచ్చాయి. త్రివిక్ర‌మ్ తీరుతెన్నులు నిర్మాత‌కు అస్స‌లు న‌చ్చ‌డం లేదు. అందుకే మ‌హేష్‌ తో ప్రాజెక్టును క్యాన్సిల్ చేసుకునేందుకు రెడీ అయ్యార‌ని చెబుతున్నారు. అందుకే మ‌హేష్ వెంట‌నే స్పందించి అడ్వాన్స్ తిరిగి వెన‌క్కి ఇచ్చేశాడ‌ని అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు వెన‌క్కి వెళ్లాకే ఇప్పుడు మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాకి ప్రిన్స్ మ‌హేష్ క్లియ‌రెన్స్ ఇచ్చార‌ని చెప్పుకుంటున్నారు. అస‌లింత‌కీ త్రివిక్ర‌మ్‌ తో రాధాకృష్ణ‌కు ఎక్క‌డ‌ చెడింది? అన్న‌ది తెలియాల్సి ఉంది.