Begin typing your search above and press return to search.

జ‌క్క‌న్న పోస్ట్ అదిరింది.. అంద‌రి నోటా ఇదే చ‌ర్చ‌

By:  Tupaki Desk   |   19 Nov 2017 3:30 PM GMT
జ‌క్క‌న్న పోస్ట్ అదిరింది.. అంద‌రి నోటా ఇదే చ‌ర్చ‌
X
ద‌స‌రా.. సంక్రాంతి క‌లిసి వ‌స్తే..? అస‌లెలా వ‌స్తుంది మాస్టారు? అన్న ప్ర‌శ్నేయొచ్చు. కానీ.. ఇక్క‌డ పాయింట్ రెండు పండుగ‌లు ఒకేసారి రావ‌టం కాదు.. ఒకేసారి ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఇప్పుడు అంతే ఆనందానికి గురి అవుతున్నారు స‌గ‌టు తెలుగు సినీ అభిమాని . బాలీవుడ్ సినిమాలు చూసే ప్ర‌తి ఒక్క తెలుగోడు తెగ ఫీలైపోతుంటారు. ఇగోల్ని ప‌క్క‌న పెట్టేసి అగ్ర‌తారలు క‌లిసి కాంబోతో న‌టిస్తుంటారు. అదేం ద‌రిద్ర‌మో తెలుగు ఇండ‌స్ట్రీలో మాత్రం క‌నిపించ‌ద‌ని మండి ప‌డుతుంటారు.

మ‌ల్టీస్టార‌ర్ ఫిలిం గురించి టాలీవుడ్ లో ఏ ఆగ్ర‌హీరోను అడిగితే.. క‌థ దొరికితే నేను రెఢీ అనేస్తుంటారు. అంద‌రూ ఆ మాట చెప్పేవారే కానీ.. ఏ ఒక్క‌రూ మ‌ల్టీస్టార‌ర్ ఫిలిం గురించి పెద్ద ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు క‌నిపించ‌దు. ఇందుకు భిన్నంగా.. కొన్ని ద‌శాబ్దాలుగా తెలుగు సినిమాలో సాధ్యం కాద‌ని భావించే ఒక అద్భుతం సాధ్యం కానుందా? అంటే అవున‌నే చెబుతున్నారు.

ఈ రోజు అగ్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఒక ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. చూసినంత‌నే వావ్ అనుకున్న ఈ ఫోటోలో ఏముందంటే.. రాజ‌మౌళికి ఇరువైపులా జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాంచ‌ర‌ణ్ లు క్లోజ్ గా ఉండ‌టం.. ముగ్గురు క‌లిసి న‌వ్వుతూ దిగిన ఫోటో వైర‌ల్ గా మారింది. సండే స్పెష‌ల్ గా విడుద‌లైన ఈ ఫోటో కొద్ది నిమిషాల్లోనే భారీ ట్రెండ్ గా మారింది.

ఆన్ లైన్లోనూ.. ఆఫ్ లైన్లోనూ ఈ ఫోటో గురించి చ‌ర్చ మొద‌లైంది. చివ‌ర‌కు తేలిందేమంటే.. బాహుబ‌లి లాంటి భారీ హిట్ త‌ర్వాత రాజ‌మౌళి తీస్తున్న చిత్రం మీద క్లారిటీ వ‌చ్చేసిందని అనుకుంటున్నారు . నంద‌మూరి.. మెగా కాంబినేష‌న్లో అరుదైన చిత్రానికి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారని అనుకుంటున్నారు . అదే జరిగితే ఒక తెలుగు సినీ అభిమానికి ఇంత‌కంటే అద్భుత‌మైన వార్త ఇంకేం ఉంటుంది.

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో నంద‌మూరి.. మెగా హీరోల మ‌ధ్య సంబంధాలు ప‌క్క‌న పెడితే.. అభిమానుల మ‌ధ్య ఉండే పోటీ అంతా ఇంతా కాదు. ఒక‌రికొక‌రు పోటాపోటీగా త‌మ అభిమానాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. తూర్పు ప‌డ‌మ‌రలా ఫ్యాన్స్ ఫీల‌య్యే కాంబినేష‌న్ తో రాజ‌మౌళి సినిమా తీయ‌నున్నార‌న్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. సంచ‌ల‌నంగా మారింది.

అటు తార‌క్ కానీ.. ఇటు రాంచ‌ర‌ణ్ కానీ విడివిడిగానే వారి సినిమాల క‌లెక్ష‌న్లు ఎంత భారీగా ఉంటాయో తెలిసిందే. అలాంటిది ఈ ఇద్ద‌రు కాంబినేష‌న్లో.. రాజ‌మౌళి లాంటి ద‌ర్శ‌కుడి సినిమా అంటూ అంచ‌నాల‌కు కొత్త అంచ‌నాలు మొద‌లైన‌ట్లే.

తార‌క్ తో రాజ‌మౌళి ఇప్ప‌టికి మూడు సినిమాలు (స్టూడెంట్ నెంబ‌ర్ 1 - సింహాద్రి..య‌మ‌దొంగ‌) సినిమాలు తీశారు. ఈ మూడు బ్లాక్ బ‌స్ట‌ర్లే. ఇక‌.. రాంచ‌ర‌ణ్ తో రాజ‌మౌళి తీసిన మూవీ మ‌గ‌ధీర‌. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి స‌రికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసిన ఈ మూవీ అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

తార‌క్ తో రాజ‌మౌళి సినిమా తీసి దాదాపు ప‌దేళ్లు అవుతుంటే.. రాంచ‌ర‌ణ్ తో మూవీ తీసి ఎనిమిదేళ్లు అవుతుంది. ఇద్ద‌రికి బాగా క్లోజ్ అయిన రాజ‌మౌళి తీయ‌బోయే ఈ సూప‌ర్ కాంబో వర్క్ అవుట్ అయితే తెలుగు సినిమా ప్రేక్ష‌కుడికి విందు భోజ‌నంగా మారుతుందన‌టం ఖాయం. బాహుబ‌లి 2ను బీట్ చేసే సినిమా వ‌స్తుందా? అన్న సందేహానికి తాజాగా వైర‌ల్ అయిన ఈ సూప‌ర్ కాంబో స‌మాధానం కానుందా? వీటికి కాల‌మే స‌రైన స‌మాధానాలు ఇస్తుంద‌ని చెప్పాలి.