Begin typing your search above and press return to search.

నాగ్ వద్దంది అందుకేనా

By:  Tupaki Desk   |   22 March 2018 6:17 AM GMT
నాగ్ వద్దంది అందుకేనా
X
నిన్న దివంగత జననేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ మమ్ముట్టి చేయబోతున్నాడు అనే వార్త మరీ షాక్ కలిగించక పోయినా అభిమానులకు మాత్రం ఆశ్చర్యం కలిగించింది. గతంలో దర్శకుడు మహి రాఘవ నాగార్జునను కలిసి ఇదే స్క్రిప్ట్ వినిపిస్తే తొలుత మెచ్చిన నాగ్ ఇప్పుడున్న రాజకీయ వాతావారణంలో బయోపిక్ చేయటం రిస్క్ అవుతుందేమో అని అలోచించి డ్రాప్ అయినట్టు మీడియా సర్కిల్స్ లో టాక్ కాస్త గట్టిగానే ఉంది. వైఎస్ ఆర్ జనామోదం పొందిన నేతే అయినప్పటికీ ఎన్నికలు మరో ఏడాదిలోనే ఉన్న తరుణం లో పొలిటికల్ టచ్ ఉన్న సబ్జెక్ట్స్ చేయటం పబ్లిక్ లో మరో రకమైన మెసేజ్ ఇచ్చే అవకాశం ఉన్నందున డ్రాప్ అయినట్టు వినికిడి. ఇది అధికారికంగా ధృవీకరించే అవకాశం లేదు. ఎందుకంటే మహి రాఘవ మమ్ముట్టితో చేయబోతున్నట్టు అఫీషియల్ గా చెప్పేసాడు కనక గతాన్ని తవ్వడు.

ఇప్పుడు మమ్ముట్టిని తీసుకోవడం పట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. పంచెకట్టులో నిండుగా కనిపించే మమ్ముట్టి దీనికి పూర్తి న్యాయం చేకూర్చగలడని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నాగార్జున చేసుంటే నేటివిటీ పరంగా మరో ప్లస్ అయ్యేది కాని మమ్ముట్టి కావడం వల్ల మరో ఉపయోగం ఉంది. మల్లు వుడ్ లో బలమైన మార్కెట్ కలిగిన మమ్ముట్టి హీరో అంటే ఎలాగూ డబ్బింగ్ వెర్షన్ రూపంలో అక్కడ కూడా విడుదల చేస్తారు. వైఎస్ గురించి మరింత లోతుగా అక్కడి వారు కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. తమిళ్ లో సైతం మార్కెట్ దక్కుతుంది. నాగ్ వదిలేయడం గురించి కారణాలు పక్కన పెడితే వచ్చే ఎన్నికల లోపు షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసేలా మహి రాఘవ పక్కా ప్లానింగ్ లో ఉన్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.