Begin typing your search above and press return to search.

ప్యాలెస్ పక్కనే ఇల్లు కొనేశారు

By:  Tupaki Desk   |   12 Sep 2017 5:05 PM GMT
ప్యాలెస్ పక్కనే ఇల్లు కొనేశారు
X
వాళ్లు బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్. సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్న వారు. దర్శక నిర్మాత ఆదిత్య చోప్రా.. సీనియర్ హీరో రాణి ముఖర్జీలు పరాయి దేశంలో ఓ పెద్ద ఇల్లు కొనుక్కోవడంలో ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు. ఇప్పుడీ జంట లండన్ లో ఓ భారీ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ బాలీవుడ్ జంటకు యూరోప్ దేశాల మీద ఉన్న మమకారమే ఇందుకు కారణంగా చెప్పచ్చు.

యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కించిన చిత్రాలలో.. అనేక మార్లు కథలో మూడొంతులు యూరోప్ కంట్రీస్ చుట్టూ తిరగడం గమనించవచ్చు. అప్పటి నుంచి ఈయనకు లండన్ నగరంపై మమకారం ఉండగా.. ఇప్పుడు మరో కారణం కూడా ఉంది. గత కొంతకాలంగా ఈ జంట లండన్ లోనే ఉంటు్నారు. వీరి కూతురు అదిరాతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు కూడా. అందుకే లండన్ లోనే ఓ ఇల్లు కొనుగోలు చేయాలని ఫిక్స్ అయిపోయి.. ఓ రిచ్ మ్యాన్షన్ ను కొనేశారు. అది కూడా బకింగ్ హాం ప్యాలెస్ కు అతి చేరువలో కావడమే విశేషం. అయితే.. ఇది కేవలం ఆదిత్య చోప్రా.. రాణి ముఖర్జీ.. వీరి కూతురు అదిరాల కోసమే ఈ మ్యాన్షన్ కావడం విశేషం.

అయితే.. ఆదిత్య చోప్రా తల్లి పామ్ చోప్రా మాత్రం ఈ విషయంలో తవ పాత మార్గాన్నే కొనసాగిస్తున్నారు. భారతీయుల సారధ్యంలో నడుస్తున్న మెఫెయిర్ లోని వాషింగ్టన్ హోటల్ లోనే ఉంటారామె.