Begin typing your search above and press return to search.

ఎక్స్ క్లూజివ్: 12న రంగస్థలానికి పవర్ స్టార్

By:  Tupaki Desk   |   10 April 2018 9:22 AM GMT
ఎక్స్ క్లూజివ్: 12న రంగస్థలానికి పవర్ స్టార్
X
మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ న‌టించిన ‘రంగ‌స్థ‌లం’ సినిమా రికార్డు క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు అమెరికా- ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ మంచి క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది. ఇప్పుడు ఆ విజ‌యానందాన్ని ప్రేక్ష‌కుల‌తో పంచుకునేందుకు ఓ స‌క్సెస్ ఫంక్ష‌న్ చేయాల‌ని నిర్ణ‌యించింది చిత్ర బృందం.

‘రంగ‌స్థ‌లం’ సినిమా వంద కోట్ల గ్రాస్ క్ల‌బ్ లో చేరిన‌ప్పుడే ఓ మీడియా స‌మావేశం ఏర్పాటుచేసింది చిత్ర యూనిట్‌. అప్పుడే రామ్ చ‌ర‌ణ్ మ‌రో స‌క్సెస్ ఫంక్ష‌న్ ఉంటుంద‌నే విష‌యం చెప్పాడు. ఇప్పుడు ఈ నెల 12న సాయంత్రం హైద‌ర‌బాద్ లో విజ‌యోత్స‌వం జ‌రుప‌బోతున్నారు. ఈమేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. అయితే ఈ వేడుక‌కి మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బాబాయ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్య అతిథిగా వ‌స్తుండ‌డం విశేషం. ఈ మ‌ధ్య‌నే కుటుంబ స‌మేతంగా రంగ‌స్థ‌లం సినిమా చూసిన బాబాయ్‌... అబ్బాయ్ న‌ట‌న‌ను- ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌ను మెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. అందుకే స‌క్సెస్ మీట్ కి వ‌చ్చిన అభిమానుల స‌మ‌క్షంలో అబ్బాయిని పొగిడేయాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

ఈ విష‌యాన్ని ధృవీక‌రిస్తూ... నిర్మాతలు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రంగ‌స్థలం సినిమా 150 కోట్ల గ్రాస్ క్ల‌బ్ లో చేరిన విష‌యాన్ని కూడా స్ప‌ష్టం చేశారు. దీంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక మ‌ళ్లీ అబ్బాయ్ - బాబాయ్ ల‌ను ఒకే వేదిక‌పై చూసే అదృష్టం అభిమానుల‌కు క‌ల‌గ‌నుంది.