Begin typing your search above and press return to search.

ప్రేమ ముదిరి రూమ్ బుక్కయిందట!

By:  Tupaki Desk   |   19 Nov 2018 6:41 AM GMT
ప్రేమ ముదిరి రూమ్ బుక్కయిందట!
X
ప్రేమ ముదిరి పాకానబడితే ఏమౌతుంది... అయితే గియితే పెళ్ళవుతుంది లేదా బ్రేక్ అప్ అవుతుంది. బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్.. అలియా భట్ ఇద్దరూ లవ్ లో పడ్డారని.. డేటింగ్ చేస్తున్నారని చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇరుకుటుంబాల నుండి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందట. దీంతో ఇద్దరూ మరింతగా చెట్టాపట్టాలేసుకుని తిరగడం మొదలు పెట్టారట.

తాజాగా బాలీవుడ్ మీడియాలో ఈ జంట గురించి ఒక వార్త బయటకు వచ్చింది. ఇద్దరూ ఈమధ్య ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్ బుక్ చేసున్నారట. ఇద్దరికీ ముంబైలో ఇళ్ళున్నాయి.. మరి రూమ్ ఎందుకు బుక్ చేస్తున్నారో అని బాలీవుడ్ మీడియాలో ఒకటే చర్చలు. ఇద్దరూ మొదటి నుండి మంచి స్నేహితులట. 'బ్రహస్త్ర' సినిమాలో ఇప్పుడు కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కారణంగానే ఇద్దరూ ప్రేమలో పడ్డారని.. ఇపుడు అసలు అందులోంచి లేవడం వీలు కావడం లేదని అంటున్నారు. అందుకే ఏకాంతంగా గడిపేందుకు గది బుక్ చేసుకున్నారట!

ఈమధ్య రణబీర్ నాన్నగారు రిషి కపూర్ కు అమెరికాలో సర్జరీ జరిగింది. అక్కడికి అలియా భట్ వెళ్ళి పరామర్శ కూడా చేసిందట. దాంతో పాటుగా ఈ రూమ్ బుకింగులు గట్రా చూస్తుంటే.. ఇటలీలో లేక్ కోమో వీరికోసం రెడీగా ఉండాల్సి వచ్చేలా ఉంది..!