Begin typing your search above and press return to search.

తొలిసారి వెబ్ సిరీస్ లో జోగేంద్ర‌!

By:  Tupaki Desk   |   18 Aug 2017 1:47 PM GMT
తొలిసారి వెబ్ సిరీస్ లో జోగేంద్ర‌!
X
బాహుబ‌లి త‌ర్వాత రాణా అంత‌ర్జాతీయ న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విడుద‌లైన‌ నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రాణా న‌ట‌న‌కు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపించారు. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ మ‌రోవైపు టీవీషోల‌తో కూడా రాణా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు. `వియూ` సంస్థ వారి `నెం. 1 యారి` టాక్ షోకు రాణా హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌రికొత్త ప్ర‌యోగాలు చేయ‌డానికి ఎప్పుడూ ముందుండే రాణా మ‌రోసారి వినూత్న ప్ర‌యోగం చేయ‌బోతున్నాడు. రాణా తొలిసారిగా ఓ వెబ్ సిరీస్ లో న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. నెం.1 యారి` టాక్ షో నిర్వ‌హిస్తున్న వియూ సంస్థ రాణాతో ఈ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేశారు.

ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్ లో వెబ్ సిరీస్‌ ల హ‌వా న‌డుస్తోంది. బోస్ జీవిత చ‌రిత్ర ఆధారంగా రాజ్ కుమార్ రావు బోస్ పాత్ర‌లో ఓ వెబ్ సిరీస్ త్వ‌ర‌లో రాబోతున్న సంగ‌తి తెలిసిందే. అదే త‌రహాలో రాణా ప్ర‌ధాన పాత్రలో త్వ‌ర‌లో ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. `సోష‌ల్‌` అనే పేరుతో వియూ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ లో మ‌రో న‌టుడు న‌వీన్ క‌స్తూరియా న‌టించ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాకు విప‌రీతంగా అల‌వాటు ప‌డిన యువ‌త‌రం ఎదుర్కుంటున్న స‌మ‌స్య‌ల నేప‌థ్యం క‌థాంశంతో ఈ వెబ్ సిరీస్‌ ను తెర‌కెక్కించ‌నున్నారు. కిడ్నాప్ కు గురైన త‌న చెల్లెలి కోసం అన్వేషించే అన్న పాత్ర‌లో న‌వీన్ న‌టిస్తున్నాడ‌ని, రాణా మ‌రో కీల‌క‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని వినికిడి. సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో ఈ సిరీస్ మొద‌టి ఎపిసోడ్‌ ను `వియూ` వెబ్ ఛాన‌ల్‌ లో ప్ర‌సారం చేయ‌నున్నారు.